కరోనా కారణంగా ముఖ్యమైన పనులకు మాత్రమే బయటకు వెళ్లాలంటూ అధికారులు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో విహార యాత్రలు అంటూ బయట తిరగడం ఏమాత్రం సరికాదంటూ చెబుతున్నారు. అయినా కూడా కొందరు చిల్లర పనుల కోసం బయట తిరుగుతూ కరోనా తెచ్చుకోవడంతో పాటు ఎంతో మందికి వ్యాప్తింప జేస్తున్నారు. ముఖ్యమైన పనులకు బయట తిరగడం అంటే తప్పదు. కాని చిన్న చిన్న విషయాలకు తిరగడం వల్లే ఇండియాలో కేసులు ఈ స్థాయిలో ఉన్నాయి అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద జలపాతం అయిన కుంటాల జలపాతంను తాజాగా స్నేహితులతో కలిసి చూసేందుకు వెళ్లారు. అక్కడ అధికారులు స్వయంగా బన్నీని మరియు ఆయన స్నేహితులను తీసుకుని జలపాతం వద్దకు వెళ్లి చూపించారు. అక్కడ దాదాపుగా గంట నుండి గంటన్నర పాటు బన్నీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఆ సమయంలో సందర్శకులు తక్కువగానే ఉన్నారు. ఇతరులను సందర్శణకు రానివ్వని అధికారులు సెలబ్రెటీలను మాత్రం పక్కన ఉండి చూపించడం ఏంటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆరు నెలలుగా నిలిచి పోయింది. త్వరలోనే షూటింగ్ కు వెళ్లాలని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే బన్నీ స్నేహితులతో కలిసి ఈ లోకల్ టూర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కరోనా టైంలో టూర్ అంటే సభ్య సమాజానికి బన్నీ ఏం మెసేజ్ ఇస్తున్నట్లో ఆయనే చెప్పాలంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నామని వెళ్లామని చెప్పినా దాన్ని పెద్దగా నెటిజన్స్ కన్సిడర్ చేయకపోవచ్చు.
394690 730714Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 825525
923566 385267Youre so correct. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a complete new view of this. I didnt realise that this concern was so crucial and so universal. You absolutely put it in perspective for me. 348555