అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది. అఖిల్ హీరోగా కమర్షియల్ సక్సెస్ దక్కించుకున్న మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. దాంతో సినిమాకు సంబంధించినంత వరకు యూనిట్ సభ్యులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమా బ్రేక్ ఈవెన్కు సమీపించింది. ఖచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ వేడుకలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గురించి నాన్న గారు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఆయన కావాలంటే ఆహా లో స్ట్రీమింగ్ చేయవచ్చు. కాని ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాల్సియల్ గా స్ట్రెస్ తీసుకున్నారు. ఈ సినిమా తో అఖిల్ కు కమర్షియల్ సక్సెస్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. చైతూ లవ్ స్టోరీ మరియు అఖిల్ ఈ సినిమా లు సక్సెస్ అవ్వడం నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ సినిమా చూస్తే బాగుంటుంది. తప్పకుండా వారు ఒక మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు అంటూ బన్నీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
965475 861998Remarkable blog layout here. Was it hard creating a good looking internet site like this? 431162