‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి గురవుతున్నారు.. ఆ కారణంగా రియాక్షన్ కనిపిస్తోంది..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వ్యాఖ్యానించారు.
అంటే, హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పినట్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసుకున్నది టీడీపీ కార్యకర్తలు కాదన్నమాట.. ఆ దాడులు చేసింది స్వయంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులేనన్నమాట. సరే, రాజకీయాల్లో విమర్శలు సహజం. అవిప్పుడు మరింతగా హద్దులు దాటేస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హేయం. ఇది రెండున్నరేళ్ళుగా కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. మరి, టీడీపీని అభిమానించేవారు, చంద్రబాబుని ప్రేమించేవారు బీపీ తెచ్చుకుని, వైసీపీ కార్యాలయాలపై దాడులు చేస్తే ఊరుకుంటారా.?
ముఖ్యమంత్రి స్థానంలో వుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పై విధంగా.. చాలా తేలిగ్గా వ్యాఖ్యానించడం సబబు కాదు. ఇది ప్రభుత్వ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం.
ఎవరికి వారు బీపీలు తెచ్చేసుకుంటే, రాష్ట్రం సర్వనాశనమైపోతుందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు, అందునా ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తెరగాలి. నిజమే, ముఖ్యమంత్రి మీద అత్యంత హేయమైన రీతిలో విపక్ష నేతలు బూతులతో విరుచుకుపడుతున్నారు. అలాంటివారి మీద కేసులు బనాయించాలి, జైళ్ళకు పంపించేలా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు అధికార పార్టీకి చెందిన నేతలపైనా వుండి తీరాలి.
కానీ, ఇలా దాడుల్ని సమర్థించే పరిస్థితి వుండకూడదు. దురదృష్టం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే మరీ ఛండాలంగా తయారైపోయాయ్.
782700 688565Can I just say what a relief to search out somebody who actually is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a problem to light and make it crucial. Extra folks need to have to learn this and perceive this facet with the story. I cant consider youre no much more common because you positively have the gift. 817012