నాంది సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాక తనకు సీరియస్ చిత్రాలు కూడా చక్కగా సెట్ అవుతాయని నిరూపించాడు. నాంది తర్వాత సభకు నమస్కారం అనే సినిమాను మొదలుపెట్టాడు నరేష్. కానీ ఆ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
ఇక దాని తర్వాత అల్లరి నరేష్ చేస్తోన్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్ర టీజర్ ను రేపు విడుదల చేయబోతున్నారు. కానీ దానికంటే ముందే ప్రీటీజర్ అంటూ చిత్ర యూనిట్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది చూపించడానికి ఒక వీడియో కట్ చేసారు. మారేడుమిల్లి రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి టీమ్ చాలానే ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.
షూటింగ్ స్పాట్ కు చేరుకోవడానికే నాలుగు గంటల సమయం పట్టేది. ఇక 250 మంది చిత్ర టీమ్ 55 రోజుల పాటు ఈ సినిమా కోసం శ్రమించినట్లు చెబుతున్నారు టీమ్.
94528 250424Hello! Ive been reading your internet web site for a while now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say keep up the very good function! 976525