Switch to English

నేరాల నిరోధానికి మద్య నిషేధమే మందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రతిరోజూ ఏదో ఒక చోట మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులు, బాధితులు మాత్రమే మారుతున్నారు. కానీ సంఘటనలు మాత్రం దాదాపు ఒక్కటే. మహిళలను వేధించడం, వారిపై లైంగిక దాడికి పాల్పడం, ఆ తర్వాత చంపేయడం. ఈ నేరాలన్నింటిలోనూ కామన్ గా ఉండే పాయింట్ ఒక్కటే.. అదే మద్యం. మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 నుంచి 85 శాతం మద్యం మత్తులో పాల్పడినవేనని గణాంకాలు చెబుతున్నాయి.

మద్యం తాగడం వల్లే నేరాలు జరుగుతున్నాయని కచ్చితంగా చెప్పలేకపోయినా.. చాలా నేరాల వెనుక దాని ప్రమేయం మాత్రం ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. మరి దీనికి అడ్డుకట్ట వేసేదెలా? అసలు మద్యం తాగి నేరాలకు పాల్పడే కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత? ఇదే విషయంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది.

మద్యంతో సంబంధం ఉన్న నేరాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. మద్యం అమ్మకాల ద్వారా అలాంటి నేరాలను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించినట్టని, అందువల్ల అలాంటి నేరాల్లో బాధితులకు సర్కారే నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. మద్య నిషేధం అమల్లో ఉండి ఉంటే కొంతలో కొంతైనా నేరాలు అదుపులో ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటనలోనూ మద్యం పాత్ర ఉంది. నిందితులంతా ఆ సాయంత్రం నుంచి తాగుతూనే కూర్చున్నారని, ఆ తర్వాతే ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసులో పరోక్ష బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నట్టే అవుతుంది. వాస్తవానికి మద్యం తాగిన వ్యక్తికి విచక్షణ అనేది ఉండదు. ఆ మత్తులో ఏం చేస్తున్నామనే స్పృహ అసలే ఉండదు.

అలాంటి పరిస్థితుల్లో మనిషి మృగంలా మారిపోతాడు. అదే మద్యం తాగని వ్యక్తి అయితే, ఏదో ఒక సందర్భంలో కనీసం విచక్షణతో ఆలోచించే అవకాశం ఉంటుంది. నేరానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. కానీ మద్యం తాగిన వ్యక్తికి ఇలాంటివి ఏమీ పట్టవు. అందుకే మద్యాన్ని నిషేధంచాల్సిన అవసరం చాలా ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతుంటారు.

అయితే, ఖజానాకు ఫుల్లుగా ఆదాయం తెచ్చి పెట్టే ఈ మహమ్మారిని వదులుకోవడానికి ఏ ప్రభుత్వానికీ మనసొప్పదు. ఓవైపు ఏపీలో మద్య నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...