ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ బిల్లు తీసుకొచ్చింది. అయితే, ఆ ‘దిశ’ బిల్లు చట్టంగా మారడంలో విఫలమవుతోంది. అయినా, ‘దిశ’ పేరుతో రాష్ట్రంలో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇంతవరకు రాష్ట్రం ప్రతిపాదించిన ‘దిశ’ బిల్లుని, కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదు.? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజాగా, మరో బిల్లు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే చుక్కెదురవుతూనే వుంది. అదే భూమి హక్కు చట్టం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చాలా పబ్లసిటీ స్టంట్లు చేస్తోంది. అయితే, రాజ్యాంగానికి లోబడి, కేంద్ర చట్టాలకు లోబడి రాష్ట్రాలు చట్టాలు చేయాల్సి వున్నా, ఆంధ్రపదేశ్ మాత్రం కొన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపడమే ఆయా బిల్లలు కేంద్రం నుంచి సానుకూల స్పందనను పొందలేకపోతున్నాయనే విమర్శలున్నాయి.
భూమి హక్కు చట్టం ఇప్పటికే రెండు సార్లు ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో పాస్ అయ్యింది. మొదటిసారి ఆమోదం తర్వాత, కేంద్రానికి వెళితే, అట్నుంచి కొన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయి. రెండోసారి కూడా కేంద్రం, రాష్ట్రం చేసిన సవరణల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం. అసలెందుకిలా జరుగుతోంది.? రాష్ట్రంలో అధికారులు తగిన రీతిలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేకపోతున్నారా.? బిల్లుల తయారీలో లోటుపాట్లను సవరించలేకపోతున్నారా.? ప్రభుత్వ పెద్దలకీ, అధికారులకీ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తాజాగా కేంద్రం, భూమి హక్కు చట్టాన్ని తిప్పి పంపిన దరిమిలా, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వుంది కొత్త సవరణలతో. మరి, ఈ సవరణలైనా కేంద్రాన్ని సంతృప్తి పరుస్తాయా.? రాజ్యాంగానికి లోబడి ఆయా బిల్లులు వుండడంలేదన్న విమర్శలకు ప్రభుత్వ పెద్దల సమాధానమేంటి.? ఏమో, వేచి చూడాల్సిందే. ఆయా బిల్లులు ఆమోదం పొందకుండానే రాష్ట్రంలో వాటి పేరుతో పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్న వైనం పట్ల రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
818920 647894quite very good post, i undoubtedly really like this website, go on it 412512
490634 940269Id forever want to be update on new articles on this internet site, bookmarked ! . 468921
134223 279147I like this post a lot. I will surely be back. Hope that I will likely be able to read more insightful posts then. Will probably be sharing your expertise with all of my associates! 269615