ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయాలపై దాడి, పలుచోట్ల అన్యమత ప్రచారం అనే అంశాలతో అట్టడుకుతోంది. రాజకీయంగా కలకలం రేగుతున్న ప్రస్తుత ప్రస్తుత తరుణంలో నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.
ఈ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో అన్యమత పార్శిల్ ఒకటి కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీలోని ఓ కుటుంబానికి ఒక క్రిస్టియన్ సంస్థ ద్వారా వచ్చిన పార్శిల్ ఇందుకు కారణమైంది. కర్నూలు నుంచి ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చిన ఈ పార్శిల్ ను స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు.
అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి పార్శిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానంలోని పర్యాటక శాఖలో పని చేసే ఒక ఒప్పంద ఉద్యోగికి ఆ పార్శిల్ వచ్చిందని తేల్చారు. సదరు క్రిస్టియన్ సంస్థ నుంచి వచ్చిన పార్శిల్ లో నిత్యావసర సరుకులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై ఆ ఉద్యోగిని పిలిచి విచారించారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టాల ప్రకారం శ్రీశైలంలో అన్యమత పార్శిళ్లు నిషేధం. పోలీసులు పూర్తిస్ధాయి విచారణ చేపట్టారు.
615917 136904I simply could not go away your website prior to suggesting that I really enjoyed the normal info an individual supply to your visitors? Is gonna be once more continuously to be able to check out new posts 80197