Switch to English

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ.. ఇప్పట్లో సాధ్యం కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అయితే, అది శాసన మండలి దగ్గర ఆగింది. కాగా, ఇప్పటికే రెండు సార్లు శాసన సభలో పాస్‌ అయిన మూడు రాజధానుల బిల్లు, శాసన మండలిలో ఆగిపోయినా.. దానికి చట్టబద్ధత లభించినట్లేనన్న భావనతో వుంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. మరోపక్క, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనీ, విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ రాకుండా ఎవరూ ఆపలేరని వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నారు.

కాగా, విజయదశమి నాటికల్లా విశాఖ నుంచి ‘ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌’ కార్యకలాపాలు ప్రారంభించాలని అధికార పార్టీ కృత నిశ్చయంతో వుందన్నది గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న హాటెస్ట్‌ గాసిప్‌. అందుకు తగ్గట్టే తెరవెనుక కార్యకలాపాలు జోరందుకున్నాయి. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్‌ రాష్ట్రంలో విజృంభిస్తున్న దరిమిలా, విజయదశమి నాటికి పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించడం కష్టం. ‘ఎలా చూసినా, ఈ ఏడాది విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెళ్ళడం కష్టమే..’ అన్న వాదన వైసీపీ వర్గాల నుంచే లీకుల రూపంలో బయటకు వస్తోంది.

విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెళ్ళినా, అమరావతి ప్రాధాన్యత తగ్గదని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతున్నా, ఒక్కసారి ‘తరలింపు’ షురూ అయితే, అత్యంత వేగంగా అమరావతి ప్రాధాన్యత అటకెక్కిపోతుందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు, తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

మరోపక్క, విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని తీసుకెళితే, కర్నూలు పరిస్థితి ఏంటి.? అని రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తుండడం గమనార్హం. ‘కర్నూలుకి న్యాయ రాజధాని అన్నారు.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విశాఖ విషయంలో మాత్రం అధికార పార్టీ అత్యుత్సాహం చూపుతోంది..’ అని ఇన్నాళ్ళూ వైసీపీకి మద్దతిస్తోన్న రాయలసీమకు చెందిన పలు ఉద్యమ, విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. మొత్తమ్మీద, రాజధాని చుట్టూ నడుస్తోన్న ఈ గందరగోళానికి ఇప్పట్లో తెరపడేలా కన్పించడంలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...