కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ను సఢలించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఓపెన్ చేసిన విషయం తెల్సిందే. ప్రతి రోజు భక్తులను దైవ దర్శనంకు అనుమతిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ భక్తులకు దర్శనం కల్పిస్తున్నా కూడా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా టీటీడీ అధికారులు వరుసగా కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 80 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు తీసుకుని శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. విధుల్లో ఉండి వైరస్ బారిన పడ్డ టీటీడీ అధికారులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వారి వల్ల భక్తులకు ఏమైనా వైరస్ సోకిందా అంటూ జనాలు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు 1765 మంది కరోనా బారిన పడ్డట్లుగా చెప్పుకొచ్చారు.
541931 763256Wonderful weblog, Im going to spend far more time reading about this subject 405730