గోవా బ్యూటీ ఇలియానా తన నడుమందాలతో కుర్రకారు మనసుకి గాలం వేసింది. దేవదాసుతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ సుందరి అనతికాలంలోనే టాప్ ప్లేస్ కు చేరుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన కెరీర్ తొలినాళ్లలోనే నటించేసిన ఇలియానా కోటికి పైగా పారితోషికం తీసుకుని అప్పట్లోనే వార్తల్లో నిలిచింది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా దాదాపు అందరు టాప్ హీరోల సరసన ఆడిపాడింది. అయితే జులాయి తర్వాత నుండి ఇలియానా టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్ చెక్కేసి అక్కడి సినిమాల్లో బిజీ అయింది.
అయితే మొదట్లో వచ్చిన ఆఫర్లు తర్వాత అమ్మడికి సన్నగిల్లాయి. బాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు చేరుకోవాలన్న ఆశలు నీరుగారిపోయాయి. ఈలోగా ఇలియానా కూడా ఔటాఫ్ షేప్ అయిపోయింది. రిలేషన్ లో ఉండడంతో కెరీర్ మీద దృష్టి పెట్టలేదు. అయితే ఈ మధ్య ఇలియానా మళ్ళీ టాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన స్టార్డం ను తెచ్చి పెట్టిన టాలీవుడ్ లో తిరిగి బిజీ కావాలనుకుంటోంది. ఇందుకోసమే తిరిగి ఫిట్ గా తయారైంది. ఈ మధ్య ఇలియానా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లు చూస్తే ఎవరైనా ఔననాల్సిందే.
తాజా సమాచారం ప్రకారం నాగార్జున-ప్రవీణ్ సత్తారుతో చేయబోయే సినిమాలో ఇలియానా ఎంపికయ్యింది అని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో టాలీవుడ్ లో ఘనంగా కంబ్యాక్ ఇవ్వాలన్న తన ఆశలు నెరవేరుతాయా?
794611 658287It is difficult to get knowledgeable folks with this subject, but the truth is could be seen as do you know what youre referring to! Thanks 755630