ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ ఎమ్మెల్సీ పదవులతోపాటు మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయడంతో కేబినెట్ లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో వాటిని భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో ఇది ముగిసిన తర్వాత శ్రావణమాసంలో ఇందుకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈనెల 21న శ్రావణ మాసం ప్రారంభం కానుండగా.. 22న మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో అమాత్య యోగం ఎవరిని వరిస్తుందో అని పలువురు ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టాన పెద్దలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరిలో ఒకరు శెట్టిబలిజ వర్గానికి చెందినవారు కాగా, మరొకరు మత్సకార వర్గానికి చెందినవారు. దీంతో ఆయా వర్గాల నుంచే కొత్త మంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
మత్సకార వర్గానికి సంబంధించి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్, పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు పేర్లు వినిపిస్తుండగా.. శెట్టిబలిజ వర్గానికి సంబంధించి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ బీసీల్లోనే ఇతర సమీకరణలు ఏమైనా వస్తే ఇందులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. విస్తరణకు ఇంకా సమయం ఉన్నందున అన్ని అంశాలనూ బేరీజు వేసుకున్న తర్వాతే ఈ పేర్లు ఖరారు చేయనున్నారు. అప్పటివరకు బీసీ ఎమ్మెల్యేలకు ఉత్కంఠ తప్పదు.
145436 215019yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her need to discover no end touching unpronounced. Thanks so considerably! 440556