Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అప్పుల కుప్పగా మారుతోన్న ఆంధ్రప్రదేశ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌కి ఒకప్పుడు ‘అన్నపూర్ణ’ అనే గుర్తింపు వుండేది. కానీ, ఇకపై ‘అప్పుల కుప్ప’ అనాలేమో.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకని పరిస్థితి. కారణం ఏదైనా, చంద్రబాబు హయాంలో రాజధానిగా ప్రకటితమైన అమరావతి, వైఎస్‌ జగన్‌ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యింది. అది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది.

రాజధాని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. అదే సమయంలో, ఆ రాజధాని రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు.మూడు రాజధానులంటూ.. అధికార పక్షం ‘కాలయాపన’ చేస్తూ, అమరావతిని అటకెక్కించేసిందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి, కరోనా మహమ్మారి మరింతగా నష్టం చేసింది. ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో, అప్పులు చేయక తప్పని పరిస్థితి.

రానున్న మూడు నెలల కోసం మరో 14 వేల కోట్ల రూపాయల అప్పు కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అప్పు కోసం అప్పుడే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళాయట. నిజానికి, కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ.. వంటివి వచ్చి వుంటే, రాష్ట్రం ఈ స్థాయి ఆర్థిక ఇబ్బందుల్లో పడేది కాదు. కానీ, కేంద్రాన్ని ఆ విషయమై ప్రశ్నించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాహసించడంలేదు.

మరోపక్క, చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారనీ, ఆయా రంగాలకు బాకీలు పెట్టారనీ, ఆ బాకీల్ని తీర్చడానికే చాలా కష్టపడాల్సి వస్తోందంటూ అసలు సమస్యను పక్కన పెట్టి అధికార పక్షం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. చంద్రబాబు హయాంలో అప్పులు జరిగిన మాట వాస్తవం. మరి, వైఎస్‌ జగన్‌ హయాంలో ఏం జరుగుతోంది.? అప్పుడూ, ఇప్పుడూ ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడాల్సిన దుస్థితిని ఏమనుకోవాలి.?

అభివృద్ధి ఊసెత్తకుండా సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాల్ని ప్రభుత్వాలు చేసినంతకాలం పరిస్థితి ఇలాగే వుంటుంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ‘సొమ్ములు’ ప్రభుత్వం నుంచి అందుతున్నా, ప్రభుత్వాలకు అప్పులు పెరుగుతున్న దరిమిలా, రాబడి కోసం.. మళ్ళీ ఆ ప్రజలపైనే భారం వేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అంతిమంగా ప్రభుత్వాల పబ్లిసిటీ స్టంట్స్‌కి నష్టపోయేది ప్రజలు మాత్రమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...