తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి అంటూ సమాచారం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితికి ప్రగతి భవన్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. తాజాగా సీఎం అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ లో కూడా కరోనా నిర్థారణ అయ్యింది.
ప్రగతి భవన్లో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు అనారోగ్యం భారిన పడ్డట్లుగా నిర్థారణ అయ్యింది. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రగతి భవన్ను మొత్తం శానిటైజేషన్ చేసి మరికొందరికి కూడా టెస్టులు నిర్వహించడం జరిగింది. ప్రగతి భవన్లో కూడా కరోనా నిర్థారణ అవ్వడంతో అధికారులు మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయమై టీఆర్ఎస్ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
351636 157598I gotta bookmark this website it seems quite beneficial . 648083