Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌ లేకపోయి వుంటే, మార్చి నెలాఖరునే ఇళ్ళ పట్టాలు పేదలకు ఇచ్చేసి వుండాలి. ఏకంగా 30 లక్షల ఇళ్ళ పట్టాల్ని ఇవ్వాలన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పం.

అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి స్థలాల సేకరణ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్ళు కట్టించడం జరిగింది. కానీ, వాటిల్లో చాలావరకు లబ్దిదారులకు చేరలేదు. కొన్ని కేటాయింపులు జరిగినా, ఆ కేటాయింపులు గందరగోళంగా తయారయ్యాయి. పేదవాడికి గూడు కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమైతే, గడచిన ఏడాది కాలంలో ఈ ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనసాగించి వుండేదే.

సరే, కారణాలేవైతేనేం.. జులై 8వ తేదీన ముహార్తం పెట్టుకున్నారు. కానీ, ఈలోగా బోల్డన్ని ఆరోపణలు. అందులో, ఇళ్ళ స్థలాల పేరుతో 20 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల దాకా పేదల నుంచి అధికార పార్టీ నేతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలే ఎక్కువ. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ విషయమై సంచలన ఆరోపణలు చేశారు. ‘స్థలాల ధరలు ఎక్కువ అవడంతో..’ అనే సాకు చూపి, స్థానిక వైసీపీ నేతలే రంగంలోకి దిగి, ఈ వసూళ్ళకు పాల్పడుతున్నారంటూ ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఘాటైన ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో దీనికి సంబంధించి నిత్యం కథనాలు చూస్తూనే వున్నాం.

మరోపక్క, లబ్దిదారుల్లో ఎక్కువగా వైసీపీ మద్దతుదారులే వుంటున్నారనీ, నిజమైన లబ్దిదారులకు చోటు దక్కడంలేదన్న ఆరోపణలూ లేకపోలేదు. అయితే, ఇదంతా విపక్షాల కుట్ర అనీ, ఇళ్ళ స్థలాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

నిజానికి, ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడమంటే ఇదొక చారిత్రక ఘట్టంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. పారదర్శకంగానే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడితే.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ, వెల్లువెత్తుతున్న ఆరోపణలు.. స్థలాలు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పేదల మాటలే నిజమైతే.. అది ప్రభుత్వానికి మాయని మచ్చగా మారుతుందన్నది నిర్వివాదాంశం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...