Switch to English

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోవడంతో.. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. దానిక్కారణం బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేయడం, జనసేన పార్టీ.. ఆ రెండు పార్టీలకీ మద్దతివ్వడం.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకున్నా, తెలంగాణలో టీడీపీ తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలూ పడింది అప్పట్లో. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి దాపురించిందనుకోండి.. అది వేరే విషయం. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అచ్చం అలానే తయారైంది.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ప్రస్తుతానికి టీడీపీకి మిగిలింది ముగ్గురే. మరో అరడజను మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి, ఈ పరిస్థితుల్లో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులకు ఎలా దిశానిర్దేశం చేయాలి.? వారిలో మళ్ళీ కొత్త ఉత్సాహం ఎలా నింపాలి.? ఈ అంశాలపై పార్టీ శ్రేణుల్లోనే నిస్తేజం నెలకొంది. ‘టీడీపీకి కొత్త నాయకత్వమే దిక్కు..’ అని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో నినదించాలనుకుంటున్నా.. ఆ మాట పైకి అనలేకపోతున్నారు.

ఇక్కడ కొత్త నాయకత్వం అంటే, నారా లోకేష్‌.. అన్న భావన కొంతమంది టీడీపీ నేతలకు కలుగుతుండడం ఆశ్చర్యం. కానీ, ఆ కొత్త నాయకత్వం అంటే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాత్రమేనన్నది మెజార్టీ టీడీపీ నేతల అభిప్రాయం. అన్నగారు స్థాపించిన పార్టీకి ఇప్పుడు ఈ దుస్థితి ఏంటి.? అని నిఖార్సయిన టీడీపీ కార్యకర్తలంతా ఆవేదన చెందుతున్నారన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితికి కారణమెవరు.? అంటే నిస్సందేహంగా చంద్రబాబే కారకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

తెలంగాణ విషయంలో కావొచ్చు, పార్టీ ఫిరాయింపుల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి టీడీపీని నిలువునా ముంచేసింది. బీజేపీతో కలిశారు, విడిపోయారు.. చివరికి కాంగ్రెస్‌తోనూ కలిసింది టీడీపీ. ఇకపై టీడీపీ కలవాలనుకున్నా, ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి. కార్యకర్తల త్యాగాల్ని కీర్తించి, తమ సొంత భజన చేసుకుంటే.. సరిపోదు.

టీడీపీ నాయకత్వం ప్రస్తుతం ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీలో మెజార్టీ ఏమనుకుంటోందో తెలుసుకోవాలి. ప్రజల తరఫున నిలబడాలి. ఆత్మ విమర్శ సాధ్యం కానప్పుడు మహానాడు నిర్వహణ ఎందుకు దండగమారి వ్యవహారం కాకపోతే.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...