కరోనా వ్యాప్తి ఎంత వేగంగా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలంతా ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు. అయినా ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా వ్యాధిగ్రస్తులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఎక్కువసంఖ్యలో కోలుకుంటున్నా మరణాలూ సంభవిస్తున్నాయి.
అయితే ఇతర అనారోగ్యాలు ఉన్నవారు ఎక్కువగా చనిపోతున్నారని కూడా అంటున్నారు. దీనికి విరుద్ధంగా ఇటివల హెచ్ ఐవీ వ్యాధిగ్రస్తుడు కరోనా బారిన పడటం, చికిత్స తీసుకుని కోలుకోవడం.. ఇంటికి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటివలే ఓ క్యాన్సర్ రోగి కూడా కరోనా నుంచి కోలుకోవడం తెలిసిందే.
యూపీకి చెందిన ఓ యువకుడు ఢిల్లీ నుంచి స్వస్థలం గోండాకు పయనమయ్యాడు. ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో తాను హెచ్ఐవీ బాధితుడునని డాక్టర్లకు చెప్పాడు. తలకు గాయం కావడంతో జరిపిన పరిక్షల్లో కరోనా కూడా సోకినట్టు చెప్పాడు. రెండింటికీ కలిపి చికిత్స చేశారు డాక్టర్లు.
అయితే.. చికిత్స చేసిన ఆరు రోజుల్లో అతను కరోనాను జయించాడు. పరీక్షల్లో ఆ యువకుడికి కరోనా నెగటివ్ వచ్చింది. కోలుకున్న యువకుడు ఇంటికి కూడా చేరుకున్నాడు. చికిత్సకు యువకుడు చురుగ్గా స్పందించడమే ఇందుకు కారణమని కేజీఎంయూ హాస్పిటల్ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎం.ఎల్.బి.భట్ చెప్పారు.
420327 221132hi, your web site is genuinely good. I truly do appreciate your give good results 370001
253036 159585I see your point, and I completely appreciate your post. For what its worth I will tell all my friends about it, quite resourceful. Later. 885259