Switch to English

న్యూ ట్విస్ట్‌: సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన పరిశ్రమ నుంచి విషవాయువులు లీక్‌ అవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం ఆఘమేఘాలమీద స్పందించి మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ప్రకటించడమే కాకుండా, తీవ్ర అస్వస్థతకు గురైనవారికి, స్వల్ప అస్వస్థతకు గురైనవారికీ పెద్దయెత్తున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మొత్తంగా 15,000 మంది ప్రజలు ప్రభావిత ప్రాంతంలో వున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం, వారందరికీ కలిపి ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించడం తెల్సిన విషయమే. ఇంతకీ, ఈ మొత్తం ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ ఏం చేయబోతోంది.? కోర్టును ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఆశ్రయించడమంటే, పరిహారం ఎగ్గొట్టడానికేనన్న వాదన విన్పిస్తోంది.

ఘటనపై వెంటనే స్పందించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థని ఆదేశించగా, ఆ ఆదేశాల్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ. ‘ఎల్జీ పాలిమర్స్‌ నుంచి పరిహారం గురించి మేం మేం మాట్లాడుకుంటాం..’ అని ఘటన జరిగాక విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం విదితమే.

ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఆ సంస్థ ఏమాత్రం పరిహారం చెల్లించేందుకు సుముఖంగా లేదనే విషయం తేటతెల్లమయిపోయింది. సంస్థకు బదులుగా ప్రభుత్వమే తన చేతి చమురు వదలించుకున్నట్లయ్యింది. నిజానికి, దేశమే ఉలిక్కిపడేలా చేసిన ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు భారీ జరీమానా విధించాల్సి వుందన్నది నిపుణుల అభిప్రాయం. కోటి కాదు.. మరణించిన వ్యక్తికి 10 కోట్ల చొప్పున పరిహారం సంస్థ నుంచి రాబట్టినా తక్కువేనన్న వాదన విన్పిస్తోంది.

తీవ్ర అస్వస్థతకు గురైనవారు, గ్యాస్‌ లీక్‌ కారణంగా ఏళ్ళ తరబడి అనారోగ్యానికి గురయ్యేవారు.. ఇలా బాధితులకు పరిహారం.. వందల కోట్లలో చెల్లిస్తేనే కాస్తో కూస్తో న్యాయం జరిగినట్లవుతుందని పరిశ్రమల వ్యవహారాల్లో నిపుణులైనవారు స్పష్టం చేస్తున్నారు.

ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అటు ఎల్జీ పాలిమర్స్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై మొదటి నుంచీ జనసేన పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఆ అనుమానాలే నిజమవుతున్నాయని సుప్రీంకోర్టుని ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆశ్రయించడంపై జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...