Switch to English

న్యూ ట్విస్ట్‌: సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన పరిశ్రమ నుంచి విషవాయువులు లీక్‌ అవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రభుత్వం ఆఘమేఘాలమీద స్పందించి మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ప్రకటించడమే కాకుండా, తీవ్ర అస్వస్థతకు గురైనవారికి, స్వల్ప అస్వస్థతకు గురైనవారికీ పెద్దయెత్తున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మొత్తంగా 15,000 మంది ప్రజలు ప్రభావిత ప్రాంతంలో వున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం, వారందరికీ కలిపి ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించడం తెల్సిన విషయమే. ఇంతకీ, ఈ మొత్తం ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ ఏం చేయబోతోంది.? కోర్టును ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఆశ్రయించడమంటే, పరిహారం ఎగ్గొట్టడానికేనన్న వాదన విన్పిస్తోంది.

ఘటనపై వెంటనే స్పందించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థని ఆదేశించగా, ఆ ఆదేశాల్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ. ‘ఎల్జీ పాలిమర్స్‌ నుంచి పరిహారం గురించి మేం మేం మాట్లాడుకుంటాం..’ అని ఘటన జరిగాక విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం విదితమే.

ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఆ సంస్థ ఏమాత్రం పరిహారం చెల్లించేందుకు సుముఖంగా లేదనే విషయం తేటతెల్లమయిపోయింది. సంస్థకు బదులుగా ప్రభుత్వమే తన చేతి చమురు వదలించుకున్నట్లయ్యింది. నిజానికి, దేశమే ఉలిక్కిపడేలా చేసిన ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు భారీ జరీమానా విధించాల్సి వుందన్నది నిపుణుల అభిప్రాయం. కోటి కాదు.. మరణించిన వ్యక్తికి 10 కోట్ల చొప్పున పరిహారం సంస్థ నుంచి రాబట్టినా తక్కువేనన్న వాదన విన్పిస్తోంది.

తీవ్ర అస్వస్థతకు గురైనవారు, గ్యాస్‌ లీక్‌ కారణంగా ఏళ్ళ తరబడి అనారోగ్యానికి గురయ్యేవారు.. ఇలా బాధితులకు పరిహారం.. వందల కోట్లలో చెల్లిస్తేనే కాస్తో కూస్తో న్యాయం జరిగినట్లవుతుందని పరిశ్రమల వ్యవహారాల్లో నిపుణులైనవారు స్పష్టం చేస్తున్నారు.

ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అటు ఎల్జీ పాలిమర్స్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై మొదటి నుంచీ జనసేన పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఆ అనుమానాలే నిజమవుతున్నాయని సుప్రీంకోర్టుని ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆశ్రయించడంపై జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...