Switch to English

బిగ్‌ షాక్‌: ఏపీలో ఈ రోజు సెంచరీ కొట్టిన కరోనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. మొత్తంగా 102 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యను 57గా చూపిస్తోంది. అదే సమయంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 45 అని విడిగా పేర్కొంటుండడం గమనార్హం. నిన్నటినుంచే ఈ విధానం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి రాకపోకలు ప్రారంభమయిన దరిమిలా, ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాలు ‘మైగ్రెంట్స్‌’ పేరుతో ప్రత్యేకంగా కేసుల వివరాల్ని ప్రకటిస్తున్నా, వాటి వివరాల్ని మొత్తం కేసులతో కలిపే చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇదిలా వుంటే, తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ తాలూకు ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కేసుల్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా, ఏపీ కేటగిరీలోనే వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ.

రాష్ట్రానికి సంబంధించి మొత్తం లెక్కలో ‘మైగ్రెంట్స్‌’ని పేర్కొనకపోతే, ఆ కేసులు దేశానికి చెందిన మొత్తం లెక్కలో కలుస్తాయా.? లేదా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇదే నిర్ణయం తీసుకుంటే.. లెక్కలు పూర్తిగా తప్పేస్తాయి. తెలంగాణలోనూ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ లేని విధానం ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు ఫాలో అవుతోందో ఏమో.. అధికార యంత్రాంగం వివరణ ఇవ్వాల్సి వుంది. ఇక, ఈ రోజు రాష్ట్రం చెబుతున్నదాన్నిబట్టి 57 కేసులు నమోదవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. కేసుల సంఖ్య మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నట్లే భావించాలేమో.

కర్నూలు జిల్లాలో నిన్న కొత్త కేసులు నమోదు కాకపోగా, ఈ రోజు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ కొత్త కేసులు (3) నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మాత్రం కొత్త కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. విశాఖపట్నంలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కోయంబేడు ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదిఏమైనా, మైగ్రెంట్స్‌ని కలుపుకుని రాష్ట్రంలో ఈ రోజు 102 కేసులు నమోదు కాగా.. కరోనా వైరస్‌కి సంబంధించి రాష్ట్రంలో ఒకే రోజు నమోదైన అతి ఎక్కువ కేసులు ఇవే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...