Switch to English

చంద్రబాబు అలా.. టీడీపీ నేతలు ఇలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

విశాఖ గ్యాస్ లీక్ ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు స్టైరీన్ అంటే ఏమిటో తెలియదని, ఇక ఐఏఎస్ లకు ఏమి తెలుస్తుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలు బాబుకు ఏమైందని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిన ఆ బాబు ఈ బాబు ఒకరేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక పరిహారం విషయంలోనూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిహాసానికి గురవుతున్నాయి.

రూ.కోటి మనిషి బతికి వస్తాడా? అసలు రూ.కోటి సరిపోతాయా? అయినా డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? అని ఆయన అనడంపై విస్తుపోతున్నారు. చనిపోయినవారిని తిరిగి తీసుకురావడం ఎవరి వల్లా కాదు. బాధిత కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని దేంతోనూ పూడ్చలేం. కానీ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం ఆనవాయితీ. ఆ డబ్బులతో వారు సుఖపడిపోతారని కాదు.. చినపోయినవారిని తిరిగి ఎలాగూ తీసుకురాలేం, కానీ మీకు ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు ఈ విధంగా సాయం చేస్తాం అని చెప్పడమే ఈ ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి కారణం. నిజానికి ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే రాజకీయ పార్టీల డిమాండ్ కూడా ఇదే ఉంటుంది. ఎవరికి తోచినరీతిలో వారు నష్టపరిహారం డిమాండ్ చేస్తుంటారు.

ప్రభుత్వం మాత్రం తాను ఇవ్వాలనుకున్నది ఇచ్చి చేతులు దులుపుకొంటుంది. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై కూడా వివిధ రాజకీయ పార్టీలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఒక్కో పార్టీ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేయాలని అనుకున్నాయి. కానీ సీఎం జగన్ రూ.కోటి పరిహారం ప్రకటించడంతో వారికి మాట్లాడటానికి వేరే అంశం లేకుండా పోయింది. మరోవైపు టీడీపీ నేతలు ఈ విషయంలో విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రూ.కోటి పరిహారం సరిపోదని, దానిని పది రెట్లు పెంచాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చారో అచ్చెన్నాయుడు మరచిపోయారా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వాదోపవాదాలను పక్కన పెడితే.. తాజాగా ప్రమాదానికి కారణమైన కంపెనీని అక్కడ నుంచి తరలించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది సహేతుకమైందే. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన ఇలాంటి ప్లాంట్లు జవాసాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ సర్కారు ఆ కంపెనీకే వత్తాసు పలుకుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి అధికార పక్షం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....