05:00PM: టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్
కొద్దీ రోజులుగా ప్రభుత్వాలు మీడియాపై తమ జులుం చూపిస్తున్నాయని ఇది వరకే తెలిపాం. ప్రస్తుతం ఓ అధికార పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రచిస్తే వారిపై అధికార రౌడీయిజం చూపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని టీవీ 5 ప్రధాన కార్యాలయం పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాని వలన ఆర్ధిక నష్టం జరిగింది. ఈ దుష్ట చర్యలపై స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై టీవీ5 యాజమాన్యానికి తన సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి దుష్ట చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
టి.వి.5 యాజమాన్యానికి నా సంఘీభావం తెలుపుతున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) May 9, 2020
04:45PM: సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తున్న రోబో డాగ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో పలు దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. రెండు మూడు నెలలు లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న కారణంగా కొన్ని చోట్ల సడలింపులు ఇస్తున్నారు. సింగపూర్లో కూడా లాక్డౌన్ విధించినా కూడా అక్కడ కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది.
పార్క్ల్లో పాదచారులు ఇంకా ఇతర కార్యక్రమాలు నిర్వహించే వారు సామాజిక దూరం పాటించేలా రోబో డాగ్ను ఏర్పాటు చేశారు. అచ్చు కుక్కలా ఉండే ఈ రోబో కుక్కలా ప్రవర్తిస్తుంది. గుంపులుగా ఎక్కడ జనాలు కనిపించినా కూడా అక్కడకు వెళ్లి సౌమ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ను పాటించాల్సిందిగా కోరుతుంది. ఆ కుక్క సౌమ్యంగా చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్క మాట విని ఫిజికల్ డిస్టెన్స్ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
04:30PM: విజయనగరం జిల్లాలో మరణాల ఖాతా తెరిచిన కరోనా
దాదాపు 40 రోజులు ఒక్క కేసు కూడా లేని విజయనగరంలో ఇటీవలే కరోనా కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. అవి రోజు రోజుకీ పెరుగుతున్నాయి కూడాను. విజయనగరం జిల్లాలో మొదట సమోదైన మొదటి కరోనా కేసు మహిళ నేడు మరణించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు కిడ్నీ ప్రాబ్లెమ్ తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్ళింది. కానీ అక్కడ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలడంతో విమ్స్ హాస్పిటల్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. కానీ కిడ్నీ సమస్య వలన కోలుకోలేక మరణించింది.
14:00AM: ఇవంకాని టెన్షన్ పెట్టిన కరోనా పాజిటివ్ కేసు.!
అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికాలో 13.22 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 79వేల మంది చనిపోయారు. నిన్ననే ట్రంప్ టీంలోని ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వైట్ హౌస్ లో హై టెన్షన్ మొదలైందని తెలిపాము.
అది జరిగి 24 గంటలు కాకముందే ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలికి మరియు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సిబ్బందిలోని ఒకరికి కరోనా పాజిటివ్అని తేలింది. ఇక్కడ కాస్త హ్యాపీ న్యూస్ ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన ఇవాంకా సహాయకురాలు దాదాపు 2 నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తుండడం. ఇవాంకతో పాటు ఆమె భర్త జరేడ్ కుష్నర్కు కోవిడ్ టెస్ట్స్ చేయగా నెగటివ్ వచ్చిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి అమెరికాని పట్టి పీడిస్తున్నట్టే వైట్ హౌస్ మీద కూడా తన జులుం చూపిస్తోంది.
11:45AM: పార్కింగ్ గొడవకి కబడ్డీ ప్లేయర్ ప్రాణం తీసిన ఎస్సై
పంజాబ్కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అర్వీందర్ జిత్ సింగ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఏఎస్సై పరమ్ జిత్ సింగ్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి అర్వీందర్ జిత్ సింగ్ ఎస్యూవీ కారులో ప్రయాణిస్తు రోడ్డు పక్కన పార్క్ చేశారు. ఆ సమయంలోనే అటుగా పెట్రోలింగ్ చేస్తూ వెళ్తున్న ఏఎస్సై పరమ్ జిత్ సింగ్ ఆ కారును చూసి ఆపి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆపారంటూ ప్రశ్నించారు. దాంతో అర్వీందర్ జిత్ సింగ్ సమాధానం చెప్పకుండా వెళ్లి పోయాడు. కారు స్పీడ్గా వెళ్తుండటంతో ఏఎస్ఐ పరమ్ జిత్ ఆ కారును ఫాలో అయ్యాడు.
కొద్ది సేపు చేజింత్ తర్వాత అర్వీందర్ జిత్ సింగ్ కారును ఆపేశాడు. ఆ సమయంలో బటయకు వచ్చిన అర్వీందర్ సింగ్పై పరమ్ జిత్ సింగ్ కాల్పులు జరిపాడు. కారులోంచి దిగుతున్న మరో వ్యక్తిపై కూడా పరమ్ జిత్ కాల్పులు జరిపాడు. అర్వీందర్ సింగ్ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసు ఉన్నతాధికారులు పరమ్ జిత్ సింగ్పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డిస్మిస్ చేయడంతో పాటు హత్య కేసును కూడా నమోదు చేసి పరమ్ జిత్ సింగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అర్వీందర్ జిత్ సింగ్ మరణంతో స్థానికంగా ఆయన అభిమానులు సన్నిహితులు శోఖంలో మునిగిపోయారు.
Panjab police silent on murder of a Sikh Kabaddi player by ASI on probing drug supply by a drug dealer in his village. No voice by DGP Dinkar Gupta who promoted MAIN BHI HARJIT nor by CM Panjab. Whether Panjab police have begun the atrocities against Sikh youths again in Panjab? pic.twitter.com/a2qYHMfMOd
— Ajmer Singh Randhawa (@smartrandhawa) May 9, 2020
10:45AM: సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి విషవాయువులు లీక్ అయ్యి 12 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఆ సంఘటన నుండి స్థానికులు తేరుకోలేక పోతున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న వెంకటాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన మొదలు పెట్టారు. కంపెనీ మూసేయండి లేదంటే పోయిన ప్రాణాలను తీసుకు రాండి అంటూ ఆందోళనకారులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
చనిపోయిన వారి మృత దేహాలను రహస్యంగా తరలించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకారులు ఎల్జీ పాలిమర్స్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు అంతా కూడా ఫ్యాక్టరీ వైపే ఉన్నారంటూ ఆందోళనకారులు అంటున్నారు. ఫ్యాక్టరీని అక్కడ నుండి తరలిస్తామని ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్నారు. సీఎం జగన్ గారు మీకు ఫ్యాక్టరీ కావాలో ప్రజలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆందోళనకారులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.
#VizagGasLeakage – 12మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ ని మూసేయాలని స్థానికులు ధర్నాకి దిగారు. పోలీసులు అతి కష్టం మీద వారిని అడ్డుకున్నారు.
ప్రజల షట్ డౌన్ డిమాండ్ పై @YSRCParty ప్రభుత్వం స్పందిస్తుందా? లైట్ తీసుకుంటుందా?#LGPolymers #janasena #TDP #YSJagan #janasenaparty pic.twitter.com/0rKDnxRxJY
— TeluguBulletin.com (@TeluguBulletin) May 9, 2020
116795 614195I got what you intend, saved to bookmarks , very decent web internet site . 788709
105627 310048Great post man, keep the nice function, just shared this with my friendz 825026