Switch to English

ఫ్లాష్ న్యూస్: టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

05:00PM:  టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్

కొద్దీ రోజులుగా ప్రభుత్వాలు మీడియాపై తమ జులుం చూపిస్తున్నాయని ఇది వరకే తెలిపాం. ప్రస్తుతం ఓ అధికార పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రచిస్తే వారిపై అధికార రౌడీయిజం చూపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని టీవీ 5 ప్రధాన కార్యాలయం పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాని వలన ఆర్ధిక నష్టం జరిగింది. ఈ దుష్ట చర్యలపై స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై టీవీ5 యాజమాన్యానికి తన సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి దుష్ట చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

04:45PM:  సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా చేస్తున్న రోబో డాగ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. రెండు మూడు నెలలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న కారణంగా కొన్ని చోట్ల సడలింపులు ఇస్తున్నారు. సింగపూర్‌లో కూడా లాక్‌డౌన్‌ విధించినా కూడా అక్కడ కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది.

పార్క్‌ల్లో పాదచారులు ఇంకా ఇతర కార్యక్రమాలు నిర్వహించే వారు సామాజిక దూరం పాటించేలా రోబో డాగ్‌ను ఏర్పాటు చేశారు. అచ్చు కుక్కలా ఉండే ఈ రోబో కుక్కలా ప్రవర్తిస్తుంది. గుంపులుగా ఎక్కడ జనాలు కనిపించినా కూడా అక్కడకు వెళ్లి సౌమ్యంగా ఫిజికల్‌ డిస్టెన్స్‌ను పాటించాల్సిందిగా కోరుతుంది. ఆ కుక్క సౌమ్యంగా చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్క మాట విని ఫిజికల్‌ డిస్టెన్స్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

04:30PM:  విజయనగరం జిల్లాలో మరణాల ఖాతా తెరిచిన కరోనా

ఫ్లాష్ న్యూస్: ఇవంకాని టెన్షన్ పెట్టిన కరోనా పాజిటివ్ కేసు.!

దాదాపు 40 రోజులు ఒక్క కేసు కూడా లేని విజయనగరంలో ఇటీవలే కరోనా కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. అవి రోజు రోజుకీ పెరుగుతున్నాయి కూడాను. విజయనగరం జిల్లాలో మొదట సమోదైన మొదటి కరోనా కేసు మహిళ నేడు మరణించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు కిడ్నీ ప్రాబ్లెమ్ తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్ళింది. కానీ అక్కడ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలడంతో విమ్స్ హాస్పిటల్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. కానీ కిడ్నీ సమస్య వలన కోలుకోలేక మరణించింది.

14:00AM: ఇవంకాని టెన్షన్ పెట్టిన కరోనా పాజిటివ్ కేసు.!

ఫ్లాష్ న్యూస్: పార్కింగ్ గొడవకి కబడ్డీ ప్లేయర్ ప్రాణం తీసిన ఎస్సై

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికాలో 13.22 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 79వేల మంది చనిపోయారు. నిన్ననే ట్రంప్ టీంలోని ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వైట్ హౌస్ లో హై టెన్షన్ మొదలైందని తెలిపాము.

అది జరిగి 24 గంటలు కాకముందే ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలికి మరియు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సిబ్బందిలోని ఒకరికి కరోనా పాజిటివ్అని తేలింది. ఇక్కడ కాస్త హ్యాపీ న్యూస్ ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన ఇవాంకా సహాయకురాలు దాదాపు 2 నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తుండడం. ఇవాంకతో పాటు ఆమె భర్త జరేడ్ కుష్‌నర్‌కు కోవిడ్ టెస్ట్స్ చేయగా నెగటివ్ వచ్చిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి అమెరికాని పట్టి పీడిస్తున్నట్టే వైట్ హౌస్ మీద కూడా తన జులుం చూపిస్తోంది.

11:45AM: పార్కింగ్ గొడవకి కబడ్డీ ప్లేయర్ ప్రాణం తీసిన ఎస్సై

ఫ్లాష్ న్యూస్: సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఏఎస్సై పరమ్‌ జిత్‌ సింగ్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తు రోడ్డు పక్కన పార్క్‌ చేశారు. ఆ సమయంలోనే అటుగా పెట్రోలింగ్‌ చేస్తూ వెళ్తున్న ఏఎస్సై పరమ్‌ జిత్‌ సింగ్‌ ఆ కారును చూసి ఆపి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆపారంటూ ప్రశ్నించారు. దాంతో అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ సమాధానం చెప్పకుండా వెళ్లి పోయాడు. కారు స్పీడ్‌గా వెళ్తుండటంతో ఏఎస్‌ఐ  పరమ్‌ జిత్‌ ఆ కారును ఫాలో అయ్యాడు.

కొద్ది సేపు చేజింత్‌ తర్వాత అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ కారును ఆపేశాడు. ఆ సమయంలో బటయకు వచ్చిన అర్వీందర్‌ సింగ్‌పై పరమ్‌ జిత్‌ సింగ్‌ కాల్పులు జరిపాడు. కారులోంచి దిగుతున్న మరో వ్యక్తిపై కూడా పరమ్‌ జిత్‌ కాల్పులు జరిపాడు. అర్వీందర్‌ సింగ్‌ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసు ఉన్నతాధికారులు పరమ్‌ జిత్‌ సింగ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డిస్మిస్‌ చేయడంతో పాటు హత్య కేసును కూడా నమోదు చేసి పరమ్‌ జిత్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ మరణంతో స్థానికంగా ఆయన అభిమానులు సన్నిహితులు శోఖంలో మునిగిపోయారు.

10:45AM: సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

వైజాగ్‌ ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుండి విషవాయువులు లీక్‌ అయ్యి 12 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఆ సంఘటన నుండి స్థానికులు తేరుకోలేక పోతున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న వెంకటాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన మొదలు పెట్టారు. కంపెనీ మూసేయండి లేదంటే పోయిన ప్రాణాలను తీసుకు రాండి అంటూ ఆందోళనకారులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

చనిపోయిన వారి మృత దేహాలను రహస్యంగా తరలించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకారులు ఎల్జీ పాలిమర్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు అంతా కూడా ఫ్యాక్టరీ వైపే ఉన్నారంటూ ఆందోళనకారులు అంటున్నారు. ఫ్యాక్టరీని అక్కడ నుండి తరలిస్తామని ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్నారు. సీఎం జగన్‌ గారు మీకు ఫ్యాక్టరీ కావాలో ప్రజలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆందోళనకారులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...