Switch to English

కేంద్రం వెనక్కి.. కాంగ్రెస్ ముందుకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పని లేకపోవడంతో పస్తులతో అక్కడ ఉండలేక.. రవాణా సౌకర్యం లేకపోవడం సొంతూళ్లకు వెళ్లలేక వాళ్లు నానా యాతనలు పడుతున్నారు. కొంతమంది మూటాముల్లె సర్దుకుని వందల కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు.

ఈ నేపథ్యంలో 40 రోజుల తర్వాత వలస కార్మికుల విషయంలో కేంద్రం స్పందించింది. వారిని స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. తగిన జాగ్రత్తలతో బస్సుల్లో వారిని తరలించాలని సూచించింది. అయితే, దీనిపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అంత దూరం నుంచి బస్సుల్లో వారిని తీసుకురావడం అసాధ్యమని, అందువల్ల ప్రత్యేక రైళ్లలో వారిని స్వస్థలాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నాయి.

ఇందుకు సమ్మతించిన కేంద్రం.. రైళ్లు నడపటానికి నిర్ణయించింది. ఒకటి రెండు రైళ్లు వెళ్లాయో లేదో కేంద్రానికి తత్వం బోధపడింది. తరలించాల్సిన వాళ్లు లక్షల్లో ఉన్నారని అర్థమైంది. వారందరినీ తరలించాలంటే శక్తికి మించిన భారమని భావించిందో ఏమో.. వెంటనే యూ టర్న్ తీసుకుంది. లాక్ డౌన్ ముందు వివిధ రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలించాలంటూ మెలిక పెట్టింది.

ఉపాధి కోసం గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కార్మికులు కొత్త మార్గదర్శకాల ప్రకారం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనర్హులన్నమాట. ఇది కార్మికుల పాలిట ఆశనిపాతమే. పైగా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారి నుంచి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం డబ్బులు వసూలు చేసి తమకు ఇవ్వాలంటూ రైల్వేశాఖ కోరడం విమర్శలకు తావిచ్చింది. సాక్షాత్తు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దీనిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ ముందుకొచ్చింది.

వలస కార్మికులను తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంతో బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీంతో దీంతో రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రంగంలోకి దిగారు. కూలీల తరలింపునకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్రం, 15 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని ప్రకటించారు. ఈ విషయాన్ని సుబ్రమణ్య స్వామే మళ్లీ ట్విట్టర్లో వెల్లడించారు. మరి ఇప్పటికైనా కార్మికులు ఏ సమస్యా లేకుండా తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ప్రభుత్వాలు సరిగా పనిచేస్తాయో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...