Switch to English

కేంద్రం వెనక్కి.. కాంగ్రెస్ ముందుకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పని లేకపోవడంతో పస్తులతో అక్కడ ఉండలేక.. రవాణా సౌకర్యం లేకపోవడం సొంతూళ్లకు వెళ్లలేక వాళ్లు నానా యాతనలు పడుతున్నారు. కొంతమంది మూటాముల్లె సర్దుకుని వందల కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు.

ఈ నేపథ్యంలో 40 రోజుల తర్వాత వలస కార్మికుల విషయంలో కేంద్రం స్పందించింది. వారిని స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. తగిన జాగ్రత్తలతో బస్సుల్లో వారిని తరలించాలని సూచించింది. అయితే, దీనిపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అంత దూరం నుంచి బస్సుల్లో వారిని తీసుకురావడం అసాధ్యమని, అందువల్ల ప్రత్యేక రైళ్లలో వారిని స్వస్థలాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నాయి.

ఇందుకు సమ్మతించిన కేంద్రం.. రైళ్లు నడపటానికి నిర్ణయించింది. ఒకటి రెండు రైళ్లు వెళ్లాయో లేదో కేంద్రానికి తత్వం బోధపడింది. తరలించాల్సిన వాళ్లు లక్షల్లో ఉన్నారని అర్థమైంది. వారందరినీ తరలించాలంటే శక్తికి మించిన భారమని భావించిందో ఏమో.. వెంటనే యూ టర్న్ తీసుకుంది. లాక్ డౌన్ ముందు వివిధ రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలించాలంటూ మెలిక పెట్టింది.

ఉపాధి కోసం గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కార్మికులు కొత్త మార్గదర్శకాల ప్రకారం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనర్హులన్నమాట. ఇది కార్మికుల పాలిట ఆశనిపాతమే. పైగా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారి నుంచి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం డబ్బులు వసూలు చేసి తమకు ఇవ్వాలంటూ రైల్వేశాఖ కోరడం విమర్శలకు తావిచ్చింది. సాక్షాత్తు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దీనిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ ముందుకొచ్చింది.

వలస కార్మికులను తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంతో బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీంతో దీంతో రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రంగంలోకి దిగారు. కూలీల తరలింపునకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్రం, 15 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని ప్రకటించారు. ఈ విషయాన్ని సుబ్రమణ్య స్వామే మళ్లీ ట్విట్టర్లో వెల్లడించారు. మరి ఇప్పటికైనా కార్మికులు ఏ సమస్యా లేకుండా తమ స్వస్థలాలకు చేరుకోవడంలో ప్రభుత్వాలు సరిగా పనిచేస్తాయో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...