లాక్ డౌన్ కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని లేకపోవడంతో కనీసం ఒక్క పూట బోజనం చేయలేక పోవడంతో పాటు కనీసం పిల్లలకు పాలు కూడా పట్టించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ముంబయిలోని వలస కార్మికులు తిండి తిప్పలు లేక అల్లాడి పోతున్నారు. ఆకలి చావులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ముంబయిలోని ఒక వలస కార్మికుల కేంద్రం వద్దకు రాత్రి సమయంలో గోధుమ పిండి అవసరం ఉన్న వారు వచ్చి తీసుకు వెళ్లాలంటూ ఒక వ్యాన్ వెళ్లింది. ఆ వ్యానులో వచ్చిన వారు పిండిలో డబ్బులు పెట్టి ఇచ్చారు.
ఆ డబ్బులు ఇచ్చింది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అంటూ గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. కొందరు అమీర్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఆమీర్ ఖాన్ స్పందించాడు. నేను గోధుమ పిండిలో డబ్బు పెట్టి పంచలేదు. అది అసత్య ప్రచారం. ఎవరో పేరు చెప్పేందుకు ఇష్టపడని రాబిన్ హుడ్ ఆ పని చేసి ఉంటాడు. ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోనని అన్నాడు.
ఐ ఫర్ ఇండియా లైవ్ కన్సర్ట్లో భార్యతో కలిసి ఆమీర్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న ఆ వార్తలపై స్పందించాడు. అదే సమయంలో అభిమానులు స్వచ్చందంగా ముందుకు వచ్చి సాయం అవసరం ఉన్న వారికి సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సేవ గుణంను కలిగి ఉండాలన్నాడు.
524384 61483I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 224790