Switch to English

ఇంగ్లీష్‌ మీడియం: జగన్‌ కోరుకున్నదే జరుగుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఇంగ్లీషు మీడియం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏదయితే అనుకుంటున్నారో అదే జరుగుతోందా.? అంటే, ప్రభుత్వం మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా. తెలుగు మీడియంని పూర్తిగా అటకెక్కించేసి, ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురావాలన్నది వైఎస్‌ జగన్‌ సంకల్పం.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తాజాగా వచ్చిన అభిప్రాయాల్ని బట్టి, ఆంధ్రప్రదేశ్‌లో 95 శాతానికి పైగానే ఇంగ్లీషు మీడియంని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైపోయింది. దాంతో, ప్రభుత్వం తన కార్యాచరణను మరింత వేగంగా కొనసాగించబోతోంది రానున్న రోజుల్లో. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ స్కూళ్ళను నింపేయాలన్నద ఇవైఎస్‌ జగన్‌ ఆలోచన.

కోర్టు మొట్టికాయలతో ఈ వ్యవహారానికి కాస్త బ్రేక్‌ పడగా, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల నేపథ్యంలో.. మరోసారి ప్రభుత్వం, ఇంగ్లీషు మీడియంపై కోర్టుకి వెళ్ళి, అట్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తెప్పించుకునేందుకు ప్రయత్నించనుంది. నిజానికి, ‘ఇంగ్లీష్‌ మీడియం వద్దు.. తెలుగు మీడియం మాత్రమే ముద్దు..’ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అనగలరా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఇంగ్లీషు మీడియంకి పెరిగిన ప్రాధాన్యత అలాంటిది.

కూలి పనులు చేసుకునేవాళ్ళూ ఎలాగైనా కష్టపడి తమ పిల్లల్ని ఇంగ్లీష్‌ కాన్వెంట్‌లో చదివించాలనుకుంటున్న రోజులివి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ పాఠశాలకు విస్తరిస్తే తద్వారా పేదలకు మేలు జరుగుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. గత ప్రభుత్వాలూ ఈ విషయమై తమవంతు కృషి చేశాయన్నది నిర్వివాదాంశం. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, తెలుగుని కేవలం ఓ సబ్జెక్ట్‌గా వుంచి, పూర్తిగా ఇంగ్లీషు మీడియం చేసెయ్యాలనే ఆలోచనతో వుంది.

కోర్టు వివాదాలు, ఇతరత్రా ఆందోళనల నేపథ్యంలో మధ్యే మార్గంగా మండలానికి ఓ తెలుగు మీడియం స్కూల్‌ అనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర వుంది గనుక.. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంపై పెద్దగా అభ్యంతరం చెప్పడానికేమీ లేదు. మరి, జగన్‌ ప్రభుత్వం తాజా ఆలోచనలపై కోర్టు ఏమంటుందో.. కొత్త విద్యా సంవత్సరం ఇంగ్లీషు మీడియంతోనే ప్రారంభమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...