Switch to English

ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కి ఎక్కువ చెల్లించారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా తాండవం జరుగుతున్న వేళ ఏపీలో అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లో మాయాజాలం చోటుచేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది నిమిషాల్లోనే కరోనా పరీక్ష ఫలితాన్ని వెల్లడించే ఈ కిట్స్ ను ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసింది.

మొత్తం 10 లక్షల కిట్స్ కు ఆర్డర్ ఇవ్వగా.. తొలి విడతలో లక్ష కిట్లు రాష్ట్రానికి చేరాయి. తొలి కిట్ తో సీఎం జగన్ కు కరోనా నిర్ధారణ పరీక్ష జరిపిన అధికారులు.. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే, ఈ కిట్ ఎంతకు కొనుగోలు చేశారనే విషయాన్ని ఏపీ సర్కారు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ కు చెందిన మంత్రి ఒకరు తాము ర్యాపిడ్ టెస్ట్ కిట్ ను ఒక్కోటీ జీఎస్టీ కాకుండా రూ.337కే కొనుగోలు చేశామని, ఇదే అతి తక్కువ ధర అని ట్వీట్ చేయడంతో ఏపీలో దుమారం రేగింది.

రెండు రాష్ట్రాలూ కొరియాకి చెందిన ఒకే కంపెనీ నుంచి ఈ కిట్స్ ని కొనుగోలు చేయడంతో ఏపీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేశాయి. రూ.337 ఖరీదు చేసే కిట్ ను ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.1200 పెట్టి కొనుగోలు చేసిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు సంధించారు. దీంతో సర్కారు స్పందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందంటూ దుష్పచారం సాగుతోందని, రూ.1200కి ఆ కిట్ కొన్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అదంతా అసత్యమని ప్రకటించింది.

ఒక్కో కిట్ ను రూ.700కి కొనుగోలు చేశామని.. తుది ధరపై సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ ఆ కిట్ కి రూ.700 చెల్లించినా.. ఛత్తీస్ గఢ్ వెచ్చించిన మొత్తానికంటే రెట్టింపు ఎక్కువ. దీంతో అటు టీడీపీ నేతలు.. ఇటు సోషల్ మీడియాలో అధికార పార్టీ వ్యతిరేకులు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఏదైనా వస్తువు కొనే ముందే ధర విషయంలో సంప్రదింపులు ఉంటాయని.. ఫలానా ధరకు కొంటామని ఒప్పందం కుదుర్చుకుని, లక్ష కిట్లు తీసుకున్న తర్వాత ఏ విధంగా బేరమాడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో వీటి ధర విషయంలో కర్ణాటక, ఛత్తీస్ గఢ్, కేరళ వంటి రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే దీనిపై వివరణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...