Switch to English

7 రోజులు.. 1700 కిలోమీటర్లు: కరోనా చేయించిన సాహసమిది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కన్నతల్లి కంటే జన్మభూమి గొప్పదంటారు. పొట్ట చేతబట్టుకుని ఎక్కడికెళ్లినా.. శేష జీవితం గడపడానికి మాత్రం సొంతూరికి వెళ్లిపోవడానికే ఎక్కువ మంది మక్కువ చూపిస్తుంటారు. జన్మభూమిపై ఉండే మమకారం అలాంటిది మరి. తాజాగా కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పలువురు సొంతూళ్లకు వెళ్లిపోవడానికే ప్రయత్నాలు చేశారు.

మొన్న ఢిల్లీలో.. నిన్న ముంబైలో వేలాది మంది వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పొడిగించడం.. ఎప్పటికి దీనికి ముగింపు పడుతుందో చెప్పలేకపోవడం ఒక కారణమైతే, లాక్ డౌన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకపోవడం మరో కారణం. అందుకే ఎక్కడో అష్టకష్టాలు పడేకంటే కలో గంజో తాగుతూ సొంతూళ్లేనే ఉందామనే భావనే వారితో అలా ఆందోళన చేయించింది. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన ఓ ఒడిశా యువకుడు.. లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూరికి వెళ్లడానికి సాహసమే చేశాడు. ఏకంగా 1700 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.

ఒడిశాలోని బిచిత్రాపూర్ కు చెందిన మహేశ్ జెనా అనే యువకుడు ముంబై సాంగ్లిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో నెలకు రూ.15వేల వేతనానికి పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూసేశారు. మూడు నెలల వరకు తెరిచేది లేదని, అప్పటివరకు రావొద్దని యాజమన్యానం చెప్పేసింది. మూడు నెలలపాటు అక్కడ ఉండాలంటే ఇంటి అద్దె తదితరాలకు రూ.30 వేలు వెచ్చించాల్సిందే. కానీ మహేశ్ వద్ద మూడు వేలు మాత్రమే ఉన్నాయి. వారం రోజులపాటు అక్కడే ఉన్నాడు. ఇక అలా ఉండటం కష్టమని భావించాడు. ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో తన దగ్గరున్న సైకిల్ పై వెళ్లాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.

ఏప్రిల్ ఒకటో తేదీన ప్రయాణం ప్రారంభించాడు. ముంబై నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీదుగా ఒడిశా చేరాడు. నాలుగు రాష్ట్రాలు, ఏడు రోజులు, 1700 కిలోమీటర్లు ప్రయాణించాడు. రోజూ తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించడం.. మధ్యాహ్నానికి ఏ దాబా దగ్గరో ఆగడం.. మళ్లీ సాయంత్రం కాస్త ఎండ తగ్గగానే సైకిల్ తొక్కడం.. ఇదీ అతడి దినచర్య. మొత్తానికి ఏడు రోజుల తర్వాత ఊరికి చేరగా.. స్థానికులు అతడిని అడ్డుకున్నారు. పరీక్షల నిమిత్తం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...