Switch to English

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌.. ఏది నిజం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

ఎప్పుడో బ్రిటిష్‌ వారి హయాంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు జరిగాయి. కానీ, ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘జలయజ్ఞం’లో కీలక ప్రాజెక్టుగా మారినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుకి అవకాశం దక్కినా.. అప్పటికీ ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం మాత్రం వీడటంలేదు.

2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని గతంలో చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంది. కానీ, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు నెలలపాటు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.. రివర్స్‌ టెండరింగ్‌ పుణ్యమా అని. అయితే, ఆ తర్వాత పనులు వేగం పుంజుకున్నాయట. ఈ మేరకు మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చిపడుతున్నాయి. మరి, ఈ కథనాల్లో వాస్తవం ఎంత.? ‘నేతి బీరకాయిలో నెయ్యి లాగానే..’ అంటున్నారు విశ్లేషకులు.

మరోపక్క, ముఖ్యమంత్రి అయ్యాక రెండో సారి పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించి, ఆ తర్వాత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నది తాజాగా ప్రభుత్వం చెబుతున్న మాట.

కాస్త అటూ ఇటూగా అయినా, 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికార పార్టీ కుండబద్దలుగొట్టేస్తోంది. కానీ, ఆ దిశగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం పోలవరం ప్రాజెక్టుకి రాలేదు. ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించి తీవ్రమైన ప్రతిబంధకంగా కన్పిస్తోన్న అంశం ‘పునరావాసం’. ఈ విషయమై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అదే మొదటి నుంచీ ప్రాజెక్టుని వివాదాల్లోకి నెట్టేస్తోంది.

సవరించిన అంచనాల్ని కేంద్రం ఇంతవరకు పూర్తిస్థాయిలో ఆమోదించలేదు. మరోపక్క, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చయిన లెక్కలపై రాష్ట్రానికీ – కేంద్రానికీ మధ్య ‘గ్యాప్‌’ కన్పిస్తోంది. పలుమార్లు కేంద్రం దృష్టికి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం (చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం) తీసుకెళ్ళినా ఆశించిన మేర కేంద్రం సహకరించని పరిస్థితి. మరెలా, 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...