చంద్రబాబుకు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. 14 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తరువాత బాబు ప్రతి విషయంలో కూడా తప్పులు చేయడం మొదలుపెట్టారు. దానికి ఓ ఉదాహరణ విశాఖపట్నం యాత్ర.
విశాఖలో చంద్రబాబు నాయుడు పర్యటన దానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవాలి. విశాఖలో బాబు పర్యటించిన సమయంలో వైకాపా నేతలు అడ్డుకున్నారు. వైకాపా నేతలు అడ్డుకున్నప్పటికీ కూడా బాబు పర్యటన చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇవాళకాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కూడా విశాఖలోనే ఉండి తన పర్యటనను పూర్తి చేస్తానని చెప్తున్నారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా జగన్ ప్రకటించిన తరువాత, అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఈ సెంటిమెంట్ ఉన్న సమయంలో దానికి వ్యతిరేకంగా పర్యటన చేస్తే దాని వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఉంటాయో అందరికి తెలుసు. దానికి ఓ ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు.
తెలంగాణలో సెంటిమెంట్ కు వ్యతిరేకంగా ఎవరు వెళ్లాలని చూసినా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అదే విశాఖలో కూడా అప్లై అయ్యింది. రాజకీయాల్లో 40 ఏళ్ళు అనుభవం ఉన్న బాబు ఇలా ఎందుకు ఆలోచించలేదు. సెంటిమెంట్ కాస్త సద్దుకున్నాక పర్యటన చేస్తే దానికి ఓ అర్ధం ఉంటుంది. ఇలా ఏదో చేయాలని హడావుడిగా పర్యటనలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
929482 626872I definitely did not realize that. Learnt something new proper now! Thanks for that. 865773
805546 440468Nie and informative post, your every post worth atleast something. 738079
938598 319101extremely good post, i undoubtedly enjoy this remarkable web site, persist in it 244304