ఓ ప్రైవేటు సంస్థ చేసిన మోసానికి బలైపోయిన ప్రజల్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావొచ్చు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టం అలాంటిది మరి.! తెలుగు రాష్ట్రాల్లో ఓ కుదుపు కుదిపేసింది అగ్రి గోల్డ్ కుంభకోణం. రాజకీయ నాయకుల అండదండలతో అగ్రిగోల్డ్ సంస్థ చెలరేగిపోయింది.. మాయ మాటలు చెప్పి, ప్రజల్ని నిలువునా దోచేసింది.
మరోపక్క, అగ్రిగోల్డ్ సంస్థ నష్టాల్ని ఎదుర్కోవడం వెనుక కూడా రాజకీయ కారణాలున్నాయనే వాదనన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటూనే వున్నారు. వారి ఆవేదన ఎట్టకేలకు వైఎస్ జగన్ హయాంలో కొంత మేర తీరుతోందనే చెప్పొచ్చు.
బాధితుల్లో కొందరికి ప్రభుత్వం చెల్లింపులు షురూ చేసింది. 10 వేలు, 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసినవారికి చెల్లింపులు జరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అగ్రి గోల్డ్ అంశంపై మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వం, అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకుంటామంటూ రాజకీయం చేసిందనీ, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అడ్డగోలుగా కొట్టేద్దామని అప్పటి ప్రభుత్వ పెద్దలు చూశారనీ ఆరోపించారు వైఎస్ జగన్.
కాగా, అగ్రిగోల్డ్కి సంబంధించి వేల కోట్ల ఆస్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడం గమనార్హం. ప్రభుత్వం బాధిత ప్రజల్ని ఆదుకుంటున్నందుకు అభినందించాల్సిందే. అదే సమయంలో, ఈ కుంభకోణం వెనుక వున్న రాజకీయ ‘గద్దల్ని’ శిక్షించినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది.
50296 48482hi and thanks regarding the particular post ive really been searching regarding this kind of info online for sum time these days hence thanks a whole lot 960490
700829 98677I dugg some of you post as I thought they were incredibly useful handy 490252
561642 143849Hey, you used to write wonderful, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a little bit out of track! come on! 46459
552422 80215I actually like your writing style, excellent information , thankyou for putting up : D. 523100