లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి సినిమాలకి బ్రేక్ ఇచ్చాక గత 13 ఏళ్లగా రాజకీయాల్లో బిజీగా ఉంటూ ముఖానికి మేకప్ వేసుకోలేదు. 13 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె సెట్లో ఒక విషయం మీద ఈ చిత్ర టీంకి బాగా టార్చర్ చూపిస్తుందని విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ ఆ విషయం ఏంటా అని ఆరా తీస్తే.. విజయ శాంతి ఈ సినిమా సైన్ చేసే టైంలోనే ఈ చిత్ర టీంకి ఒక కండిషన్ పెట్టిందట. అదేంటంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి వచ్చే న్యూస్, ప్రమోషన్స్, ప్రెస్ నోట్స్ ఎలాంటి వాటిలో అయినా మహేష్ బాబు మొదటి ప్రియారిటీ అయితే సెకండ్ విజయశాంతి పేరు ఉండాలని ఆ తర్వాతే ఎవరి పేరైనా రావాలని కండిషన్ పెట్టిందట. తనకి క్రేజ్ ఉంది కదా అని అప్పడు టీం ఓకే అన్నారు. టీం నుంచి వచ్చే అఫీషియల్ వార్తల్లో మహేష్ బాబు తర్వాత ఆమెకే స్థానం ఇస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వారికి తెలియకుండా వచ్చే వార్తల్లో కూడా విజయ శాంతి పేరు ఎక్కడో చివర పెడుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు, నా కండిషన్ మరచిపోయారా అంటూ టీం మీద చిరాకు పడుతుందట.
Also Read: ప్రభాస్ దారిలోనే .. మహేష్ కూడా !!
విజయశాంతి గారి టీం పర్సనల్ గా ఆవిడపై రాసే ఆర్టికల్స్ ని చెక్ చేస్తూ రాసిన వారికి కాస్త ఇబ్బందులు పెడుతూ, సెట్లోనూ టీం కి కాస్త ఇబ్బంది పెడుతున్నారట. స్వతహాగానే ఫైర్ బ్రాండ్ గా పేరున్న పేరున్న విజయశాంతి గారు ఫైర్ అవ్వకుండా మహేష్ బాబు టీం ఇకనైనా జాగ్రత్త పడరారో? లేదో?
వరుస హిట్స్ తో జోరు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
298549 769616Merely wanna input that you have a very nice web site , I enjoy the pattern it truly stands out. 992574