Social media: నేటి సోషల్ మీడియా (Social media) యుగంలో అంతా పబ్లిసిటీనే. టాలెంట్ చూపించుకునేందుకు అనేక వేదికలు సిద్ధంగా ఉన్నాయి. అయితే.. ఈ వేదికలు ప్రమాదాలకు కూడా నిలయంగా మారుతున్నాయి. రైలు పక్కనే రీల్స్, బైక్ పై ప్రమాదకరంగా వీడియోలతో ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడిలాంటిదే చైనాలోనూ (China) జరిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే..
చైనా వెర్షన్ టిక్ టాక్ (Tik tok) డుయిన్ లో వాంగ్ అనే లైవ్ స్ట్రీమర్ మే 16న పీకే అనే పోటీలో మరో వ్యక్తితో పోటీ పడ్డాడు. సోషల్ మీడియాలో పోస్ట తర్వాత వీక్షకుల నుంచి బహుమతులే కాదు.. ఓడినవారికి శిక్షలు కూడా ఉంటాయి. వాంగ్ ఈ పోటీలో ఓడిపోవడంతో చైనీస్ వోడ్కాగా పేరున్న బైజ్యూ అనే మద్యం నాలుగు సీసాలు లైవ్ లో తాగాల్సి వచ్చింది.
దీంతో వరుసగా నాలుగు బాటిల్స్ చైనా మద్యం ఎటువంటి విరామం లేకుండా తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. కానీ.. పరిస్థితి చేయిదాటి పోవడంతో చికిత్స పొందుతూ మరణించాడు.