Vande Bharat: ‘ఆకాశంలో సగం మాది’ అంటూ మహిళలు అది ఇది అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. మగ వాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునే రంగంలోకి ఆమె మూడు దశాబ్దాల క్రితమే అడుగు పెట్టారు. అప్పటినుంచి ఆ రంగంలో తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నారు. ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత వేగంగా నడిచే ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు నడిపి రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ లోకో పైలట్ గా అవతరించారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమె పైనే ఉంది. మహారాష్ట్రలోని సతారా సురేఖ స్వస్థలం. 1988లో తొలిసారిగా రైలు నడిపి జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.
2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ నాలుగు మెట్రో నగరాల్లో ప్రవేశపెట్టిన లేడీస్ స్పెషల్ ట్రైన్ ను నడిపారు. తాజాగా అత్యధిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వందే భారత్ రైలు నడిపారు. ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు సుమారు 450 కిలోమీటర్లు నడిపారు. షెడ్యూల్ టైం కంటే ఐదు నిమిషాలు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకోవడం విశేషం. ఈ ఘనతతో ప్రధాని మోదీ చేత సురేఖ శభాష్ అనిపించుకున్నారు.
Hello, I enjoy reading through your post. I wanted to write a little comment
to support you.
604548 97423Enjoyed examining this, really great stuff, thanks . 790545
622298 890965Hey I was just looking at your internet site in Firefox and the image at the top with the link cant show up appropriately. Just thought I would let you know. 61156
108698 124845Hey there! Fantastic post! Please do tell us when we shall see a follow up! 966600