Kantara: గతేడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది ‘కాంతారా’. ఎన్నో రికార్డులనూ కొల్లగొట్టింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఈరోజు ఐరాసలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఈ చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుని, ఆనందం వ్యక్తం చేశారు.
‘పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో భారతీయ సినిమాలు వచ్చాయి. తాజాగా ‘కాంతారా’ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాం. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం గురించి చర్చించాం. ఇలాంటి సినిమాలు ప్రకృతి ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఇవ్వాలో మనకు అర్థమయ్యేలా చేస్తాయి. భారత సంస్కృతిలో అడవికి, మనిషికి మధ్య ఎంత మంచి సంబంధం ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పాం. పర్యావరణ మూలాల గురించి రేపటి తరం తరానికి తెలియాలన్నదే మా ఉద్దేశం’ అని రిషబ్ తెలిపారు.
కర్ణాటకలోని ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు.. దోపిడీదారులు నుంచి తమ అడవిని ఎలా కాపాడుకున్నారనే విషయంపై ‘కాంతారా’ తెరకెక్కింది. ఇందులో ‘భూత కోల’ అంశాన్ని కూడా చర్చించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కన్నడ లో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ హిట్ టాక్ అందుకుంది. సినిమా క్లైమాక్స్లో రిషబ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘కాంతారా’ సుమారు రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసింది.
505688 875124I appreciate your function , thanks for all the informative weblog posts. 347938