Switch to English

ఆ ఐదు నిమిషాల పని వైసీపీకి ఎందుకు చేతకావట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘యాత్రను అడ్డుకోవడమెంత పని.? ఐదు నిమిషాలు చాలు..’ అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్మార్గుడిగా ఇదే బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఇప్పుడు అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంచన చేరి, మంత్రి పదవి పొందరు. ‘వైఎస్ మరణం వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా వుండి వుడొచ్చు..’ అని ఇదే బొత్స గతంలో ఆరోపించారు.. అప్పట్లో కాంగ్రెస్ నేతగా వున్నప్పుడు.

ఈ బొత్స సత్యనారాయణే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే తప్పేంటన్నారు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రాంతం వుంటే బావుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణే, అమరావతి ముంపు ప్రాంతమని చెబుతున్నారు.

అసలు ఈ పాత కథ ఇప్పుడెందుకు.? అంటే, రాజకీయ నాయకులు ఉసరవెల్లుల్లా ఎలా మాట మార్చుతారో చెప్పడానికి మాత్రమే.! రాజకీయ నాయకులు ఊసరవెల్లుల్లా రంగులు మార్చేయగలరు.. కానీ, రాజధానుల్ని కూడా మార్చేస్తారా.? అన్నదే ఇక్కడ అసలు చర్చ. ఎవరూ అధికారంలో వుంటే, వారికి నచ్చినట్లు రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలాగన్న ఇంగితం బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లకు కలగకపోవడం ఆశ్చర్యకరం.

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఆ ఉత్తరాంధ్ర బాగు కోసం ఏనాడూ ఆయన రాజకీయంగా కృషి చేసింది లేదు. రాజకీయంగా కీలక పదవుల్లో వుండి, ఉత్తరాంధ్రకు ఆయన చేసిన మేలు ఏంటి.? విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపగలుగుతున్నారా.? ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని భావిస్తున్న రైల్వే జోన్ గురించి ఆయన మాట్లాడగలుగుతున్నారా.?

ఉత్తరాంధ్రలో ప్రజలకూ సెంటిమెంట్లు వుంటాయట.. వాటిని రెచ్చగొట్టొద్దంటూ అమరావతి రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు బొత్స. సెంటిమెంట్లు ఎలా వుంటాయో, బొత్సకి సమైక్య ఉద్యమం సమయంలోనే బాగా తెలిసి వచ్చి వుండాలి. ఆ వ్యవహారాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు. రాజధాని అంశం వేరు, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేరు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతికి అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే, అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ప్రభుత్వమే విఫలమైంది. అమరావతి నుంచి అరసవెల్లికి రైతులు పాదయాత్ర చేస్తోంటే, దీన్ని అడ్డుకునేందుకూ ప్రభుత్వ పరంగా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ విషయం బొత్సకు అర్థమవుతుందో లేదో.!

కొంతమంది వైసీపీ గూండాల్ని గతంలో టీడీపీ కార్యాలయం పైకి పంపించినట్లుగా, అమరావతి రైతుల మీదకు అలాంటి గూండాల్ని పంపే ఆలోచన ఏమైనా చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాజధానికి భూములిచ్చిన రైతులు వాళ్ళంతా. రాజకీయాలు చేసేటోళ్ళు కాదు. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులు అసలే కాదు. రాజధానికి భూములివ్వడమంటే, రాష్ట్రానికి భూములిచ్చారని అర్థం. ఆ మాత్రం ఇంగితం ఉత్తరాంధ్ర ప్రజలకైనా, రాయలసీమ ప్రజలకైనా వుంటుంది.. వైసీపీ రాజకీయ నాయకులకు తప్ప.

మేమెందుకు రాజధానికి భూములివ్వాలని ఆ రైతులు అనుకుని వుంటే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమరావతి వుండేదే కాదు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...