ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నిన్న మూడో టి20 మ్యాచ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెల్సిందే. లాస్ట్ ఓవర్ వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం కొంత మంది క్రికెటర్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట సందడి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రామ్ చరణ్ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది. చరణ్ బాబు ఇంటికి పాండ్య వచ్చాడని, పిక్స్ త్వరలోనే వస్తాయని తెలిపాడు.
తాజా సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇంకా పలువురు క్రికెటర్లు రామ్ చరణ్ ఆహ్వానం మేరకు తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ విందుతో పాటు రామ్ చరణ్ వారిని సత్కరించి గౌరవించినట్లు సమాచారం.
957152 450864Be the precise blog in the event you have wants to learn about this topic. You comprehend considerably its almost onerous to argue to you (not that I personally would needHaHa). You undoubtedly put a new spin for a topic thats been discussing for some time. Nice stuff, basically nice! 266089