‘యాత్రను అడ్డుకోవడమెంత పని.? ఐదు నిమిషాలు చాలు..’ అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్మార్గుడిగా ఇదే బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఇప్పుడు అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంచన చేరి, మంత్రి పదవి పొందరు. ‘వైఎస్ మరణం వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా వుండి వుడొచ్చు..’ అని ఇదే బొత్స గతంలో ఆరోపించారు.. అప్పట్లో కాంగ్రెస్ నేతగా వున్నప్పుడు.
ఈ బొత్స సత్యనారాయణే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే తప్పేంటన్నారు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రాంతం వుంటే బావుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణే, అమరావతి ముంపు ప్రాంతమని చెబుతున్నారు.
అసలు ఈ పాత కథ ఇప్పుడెందుకు.? అంటే, రాజకీయ నాయకులు ఉసరవెల్లుల్లా ఎలా మాట మార్చుతారో చెప్పడానికి మాత్రమే.! రాజకీయ నాయకులు ఊసరవెల్లుల్లా రంగులు మార్చేయగలరు.. కానీ, రాజధానుల్ని కూడా మార్చేస్తారా.? అన్నదే ఇక్కడ అసలు చర్చ. ఎవరూ అధికారంలో వుంటే, వారికి నచ్చినట్లు రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలాగన్న ఇంగితం బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లకు కలగకపోవడం ఆశ్చర్యకరం.
బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఆ ఉత్తరాంధ్ర బాగు కోసం ఏనాడూ ఆయన రాజకీయంగా కృషి చేసింది లేదు. రాజకీయంగా కీలక పదవుల్లో వుండి, ఉత్తరాంధ్రకు ఆయన చేసిన మేలు ఏంటి.? విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపగలుగుతున్నారా.? ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని భావిస్తున్న రైల్వే జోన్ గురించి ఆయన మాట్లాడగలుగుతున్నారా.?
ఉత్తరాంధ్రలో ప్రజలకూ సెంటిమెంట్లు వుంటాయట.. వాటిని రెచ్చగొట్టొద్దంటూ అమరావతి రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు బొత్స. సెంటిమెంట్లు ఎలా వుంటాయో, బొత్సకి సమైక్య ఉద్యమం సమయంలోనే బాగా తెలిసి వచ్చి వుండాలి. ఆ వ్యవహారాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు. రాజధాని అంశం వేరు, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేరు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతికి అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే, అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ప్రభుత్వమే విఫలమైంది. అమరావతి నుంచి అరసవెల్లికి రైతులు పాదయాత్ర చేస్తోంటే, దీన్ని అడ్డుకునేందుకూ ప్రభుత్వ పరంగా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ విషయం బొత్సకు అర్థమవుతుందో లేదో.!
కొంతమంది వైసీపీ గూండాల్ని గతంలో టీడీపీ కార్యాలయం పైకి పంపించినట్లుగా, అమరావతి రైతుల మీదకు అలాంటి గూండాల్ని పంపే ఆలోచన ఏమైనా చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాజధానికి భూములిచ్చిన రైతులు వాళ్ళంతా. రాజకీయాలు చేసేటోళ్ళు కాదు. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులు అసలే కాదు. రాజధానికి భూములివ్వడమంటే, రాష్ట్రానికి భూములిచ్చారని అర్థం. ఆ మాత్రం ఇంగితం ఉత్తరాంధ్ర ప్రజలకైనా, రాయలసీమ ప్రజలకైనా వుంటుంది.. వైసీపీ రాజకీయ నాయకులకు తప్ప.
మేమెందుకు రాజధానికి భూములివ్వాలని ఆ రైతులు అనుకుని వుంటే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమరావతి వుండేదే కాదు.!
769731 379871Wow, suprisingly I never knew this. Maintain up with great posts. 717337
174775 868763Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just a little out of track! 110153
411475 250566Billiard is a game which is mostly played by the high class folks 674886
386372 883389An intriguing discussion will probably be worth comment. I think that you basically write much much more about this subject, it may well become a taboo topic but usually consumers are inadequate to communicate in on such topics. To yet another. Cheers 778999