మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,86,384 మందికి వైరస్ సోకింది. అయితే.. పాజిటివిటీ శాతం మాత్రం 20 శాతానికి సమీపించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేరళలో 49వేలు, కర్ణాటకలో 48వేలు వైరస్ కేసులు బయటపడ్డాయి.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో 573 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా కేరళలోనే 140 మంది ఉన్నారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4.13 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 4,91,700 మంది మృతి చెందారు. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఈ సంఖ్య దేశంలో 3.76 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్లు 163 కోట్ల మార్కు దాటింది.
950832 363098Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned far more from this post. Im extremely glad to see such wonderful information being shared freely out there. 872865
755386 266777Every e-mail you send should have your signature with the link to your internet website or weblog. That typically brings in some visitors. 776890