మొన్నటి వరకు ఇండియాలో ఓటీటీ మార్కెట్ ఒక మోస్తరుగానే ఉండేది. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో మాదిరిగా ఓటీటీ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఇండియాలో ఒక్కసారిగా ఓటీటీ బిజినెస్ పెరిగింది. వందల నుండి వేల కోట్లకు ఓటీటీ విస్తరించింది. సినిమా హాల్స్ లేకపోవడంతో పాటు, శాటిలైట్ పోగ్రామ్స్, సీరియల్స్ లేకపోవడంతో అంతా కూడా ఓటీటీ మీద పడుతున్నారు. దాంతో పెద్ద ఎత్తున ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు లాభాలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు థియేటర్లలో విడుదల అయిన సినిమాలను మాత్రమే కొనుగోలు చేసిన ఓటీటీ లు ఇప్పుడు విడుదల కోసం వెయిట్ చేస్తున్న సినిమాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే సూర్య భార్య కీలక పాత్రలో నటించిన ఒక తమిళ సినిమాను అమెజాన్ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా రెండు మూడు చిన్న సినిమాలు కూడా నేరుగా ఓటీటీపై స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. ఈ సమయంలోనే బాలీవుడ్ మోస్ట్ క్రేజీ బయోపిక్ ‘83’ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సినిమాల విడుదలకు ఈ ఏడాది సరైనది కాదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హాల్స్ ఈ ఏడాదిలో ఓపెన్ అయినా కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా భయం భయంగానే జనాలు ఉంటారు. కనుక విడుదలకు రెడీ అయిన 83 సినిమాను ఇప్పట్లో విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఓటీటీపై విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమా బడ్జెట్కు రెట్టింపు రేటును ఆ ఓటీటీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట. అంతా సవ్యంగా జరిగితే మే మొదటి వారంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
797569 994281Exploring in Yahoo I finally stumbled upon this website.Reading this info. 14804
406058 152638What cell phone browser is this site page optimized for Internet explorer? 679312