వైసీపీ పనితీరుని విమర్శించిన సొంత పార్టీ ఎమ్మెల్యే!!
వైసీపీ నేతలు విపరీతంగా స్వామి భజన చేస్తూ అధికారుల సహాయంతో ప్రజలకి నిత్యావసర వస్తువులు పంచుతున్నాం అనే పబ్లిసిటీ స్టంట్ ని రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాత్రం స్వామి భజనకి విరుద్ధంగా తమ ప్రభుత్వ పని తీరుపై, అధికారులపై విరుచుపడ్డారు. దానికి కారణం నాణ్యత లేని సరుకులు అందించడమే. కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు బియ్యం, నూనె ఇతర సరుకులు పంపిణీ చేశారు. కానీ అవి అస్సలు నాణ్యంగా లేవని, అస్సలు జంతువులు కూడా ఇలాంటి సరకులు తినలేవని కామెంట్ చేశారు. ఈ విషయంపై జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనని తెలియజేశారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని మహీధర్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ఎవరైనా అధికారులు కావాలనే ఇలాాంటి పనులు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వరుస పబ్లిసిటీ స్టంట్స్ తో అడుగడుగునా సమస్యలతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వ పనితీరుపై తమ ఎమ్మెల్యేనే ఇలాంటి కామెంట్స్ చేయడం వైసీపీకి అదనపు తలనొప్పిగా మారుతున్నాయి.
#YCP MLA questioning @YSRCParty
మావాళ్ళు జర్నలిస్టుల మేలుకోసం సరఫరా చేసిన బియ్యం,నూనె ఇతర సరుకులు జంతువులూ కూడా ముట్టని విధంగా ఉన్నాయి.ఇలాంటి వాటిని ఇచ్చినందుకు జర్నలిస్టులు నిరసన చేశారు.ఎవరి వల్ల ఈ తప్పు జరిగిందో వారిపై చర్యలు కఠిన తీసుకోవాలి- #YSRCP MLA మానుగుంట మహీధర్ రెడ్డి pic.twitter.com/yD3BDsQwaY
— TeluguBulletin.com (@TeluguBulletin) April 27, 2020
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఓఎస్డీ కి కరోనా కలకలం
మొన్న రాష్ట్రపతి భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్ ఖరారైన న్యూస్ తెలిసిందే.. ఇప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కి ఓఎస్డీగా పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మంత్రి గారి టీం మొత్తం అప్రమత్తం అవ్వడమే కాకూండా ఆ సెక్యూరిటీ గార్డ్ ని ఎయిమ్స్కు తరలించి, ఓఎస్డీ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పోలీస్ టీం అతను ఎవరెవరిని కలిసాడు అనే పనిలో ఉన్నారు. దానితో పాటుగా తనతో పనిచేసే సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లమని అధికారులు ఆదేశించారు.
వార్ జోన్ లా మారిన ఏపీ – తమిళనాడు బార్డర్
గత కొద్దీ రోజులుగా ఏపీ అండ్ తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎంత లాక్ డౌన్ ప్రకటించినా ఇరు రాష్టాల బార్డర్స్ వద్ద రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో తమిళనాడు నుంచి చిత్తూరులోకి ప్రవేశించే మూడు ప్రధాన మార్గాలను బ్లాక్ చేయమని వేలూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దాంతో పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ దారి మరియు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే ప్రధాన మార్గాల బార్డర్స్ లో గోడలు కట్టి మరీ రోడ్స్ ని బ్లాక్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం చేసిన ఈ మంచి పనికి కూడా అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
107305 671219I truly prize your function , Great post. 854797
678898 316325Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our area library but I believe I learned more from this post. Im extremely glad to see such fantastic information being shared freely out there. 939371
480286 494183i could only wish that solar panels cost only several hundred dollars, i would enjoy to fill my roof with solar panels- 415076