లాక్ డౌన్ సమయంలో ఓ వ్యాపారంలో లాభాలొచ్చాయంటే నమ్మడం కష్టమే. కానీ.. అదే జరిగిందని చెప్తోంది ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ ‘పార్లే’. లాక్ డౌన్ ఉన్న మార్చి, ఏప్రిల్, మే.. నెలల్లో ఈ కంపెనీ బిస్కెట్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. ఎంతగా అంటే.. 1938లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచీ.. ఏనాడు ఈ మూడు నెలల స్థాయిలో అమ్మకాలు జరగనంత. ఇవన్నీ పార్లే జీ సంస్థ చెప్పిన గణాంకాలే. ఈ అమ్మకాలతో కంపెనీ ఆర్ధిక కష్టాల నుంచి గట్టేక్కిసిందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
‘లాక్ డౌన్ టైమ్ లో నిత్యావసరాలకు అనుమతి ఉండటంతో బిస్కెట్ల ఉత్పత్తి పెంచాం. సిబ్బందికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి సప్లైలో ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నాం. లాక్డౌన్ వల్ల పేదలు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. తక్కువ ధరకే లభించే పార్లేజీ బిస్కెట్లు వారి ఆకలి తీర్చాయి. దాతలు కూడా పార్లేజీ బిస్కెట్లనే పేదలకు పంచారు. వలస కార్మికులు కూడా పార్లేజీ బిస్కెట్లతోనే ఆకలి తీర్చుకున్నారు. రూ.5కే బిస్కెట్ ప్యాకెట్ లభించింది. ఇది కామన్ మ్యాన్ బిస్కెట్. కిలో బిస్కెట్లను రూ.77కే అమ్ముతున్నాం’ అని చెప్పుకొచ్చారు.
‘పార్లేజీ ప్రతి రోజు 40 కోట్ల బిస్కెట్లు తయారు చేస్తుంది. ఒక నెలలో తయారయ్యే బిస్కెట్లు భూమి, చంద్రుడి మధ్య దూరమంత. ఏడాదిలో తయారయ్యే బిస్కెట్లతో భూమి చుట్టూ 150కి పైగా రౌండ్లు చుట్టొచ్చు’ అని ప్రచారంలో ఉంది. మొత్తానికి లాక్ డౌన్ ‘పార్లేజీ’కి బాగా కలిసొచ్చిందన్నమాట.
505665 820384Basically received my very first cavity. Rather devastating. I would like a super smile. Looking a good deal much more choices. A lot of thanks for the post 416471