కేవలం రెండు గంటల్లో కరోనా సోకిన 7గురు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుగొలిపే ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. స్థానిక జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించి ఆశ్చర్యం కలిగించే విషయాలు ముంబై మిర్రర్ అనే వార్తా పత్రిక ప్రచురించింది. చనిపోయిన వారంతా కరోనా వల్ల కాదని తెలిసింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో వీరంతా చనిపోయినట్టు తేలింది.
ఆస్పత్రిలో సిలిండర్ల కొరత ఏర్పడిందని.. ఆస్పత్రి వర్గాలు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసే సరికే జరగరాని నష్టం జరిగిందని విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 12 మంది రోగులు చనిపోయినట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల కొరత ఉందని ఇతర వైద్యులు అంటున్నారు. ఈ కారణంగా కరోనా వైద్యలు పర్యవేక్షణ చేయడం కష్టంగా ఉందని కూడా వ్యాఖ్యానించడం విశేషం.
‘కేవలం గంటల వ్యవధిలో 7గురు చనిపోవడం ఆవేదనకు గురి చేస్తోంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన సమయంలో రోగులంతా శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అంటోంది. తాము స్పందించి టెక్నీషియన్ సాయంతో ఆక్సిజన్ లెవెల్స్ పెంచేలోపే ఈ దారుణం జరిగిపోయింది. అప్పటికే ఈ విషయంపై వైద్యుడికి సమాచారం ఇచ్చాం’ అని ఓ నర్సు తెలిపింది.
ఈ ఘటన తర్వాత తెల్లవారుఝామున 4గంటల సమయంలో ఆస్పత్రి సూపరెంటిండెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఆక్సిజన్ కొరత వల్ల రోగులు చనిపోలేదని ఆయన అంటున్నారు. మరోవైపు మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 2940 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 65,168 కు చేరుకుంది. కరోనాతో ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,197 కరోనా మరణాలు నమోదయ్యాయి.
330360 285153Cpr KIts quite fantastic read you know alot about this topic i see! 539369