ఓపక్క దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. మరోపక్క బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 2వేల వరకూ బ్లాక్ ఫంగస్ కేసులు ఉండొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ముందుజాగ్రత్తగా వైద్యా కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులను ప్రత్యేక చికిత్సా కేంద్రాలుగా మారుస్తున్నట్టే పేర్కొంది. పలు విభాగాల్లో దీని బాధితులకు చికిత్స అందించాల్సి ఉందని వైద్యశాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు.
కరోనా రోగులపై, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ ఫంగస్ వ్యాపిస్తోంది. ఈ బాధితుల్లో కంటి చూపు కోల్పోవడం, తలనొప్పి, జ్వరం, పార్శ్వనొప్పి, సైనస్, శ్వాసనాళం మూసుకుపోవడం జరుగుతుంది. ఇప్పటికైతే బ్లాక్ ఫంగస్ బాధితుల్లో మరణాల రేటు 50శాతం ఉండటం కలవరపెడుతోంది. ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటోంది. దీని బాధితులను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపొడొచ్చని వైద్యులు అంటున్నారు
817846 800059Wholesale Inexpensive Handbags Will you be ok merely repost this on my internet site? Ive to allow credit where it can be due. Have got a terrific day! 648204
537361 279433But a smiling visitor here to share the adore (:, btw wonderful pattern . 861596