ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పాఠాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా చాలా మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల స్కూల్ విద్యార్థులు ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు అవుతున్నది అంతంత మాత్రమే. ఇక ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన పిల్లలు కూడా చాలా మంది ఆన్ లైన్ క్లాస్ లు వినడం లేదు.
చాలా స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్ లను నిర్వహించడం లేదు. కొన్ని స్కూల్స్ 9 మరియు 10వ తరగతి పిల్లల వరకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుంటే మరికొన్ని స్కూల్స్ మాత్రం తమ వద్ద చదువుకునే పిల్లలు మొబైల్ సౌకర్యం కలిగి ఉండక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో క్లాసులు షురూ చేయలేదు.
రాష్ట్రంలో మొత్తం 15290 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో మొత్తం 31 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపుగా 12 లక్షల మంది ఇప్పటి వరకు ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కాలేదు. వారు ఈ ఏడాది మొత్తం మిస్ అవ్వాల్సి రావచ్చు అంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కొన్ని పాఠాలు చెబుతున్నా మినిమం ఫీజును చెల్లిస్తే తప్ప ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కానివ్వడం లేదు.
దాంతో చాలా మంది ఆర్థిక పరిస్థితి కారణంగా కూడా చదువుకు దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో దాదాపుగా 40 శాతం మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారు. కరోనా పరిస్థితులు ఈ ఏడాది మొత్తం కొనసాగే అవకాశం ఉంది కనుక వారు మరో మూడు నాలుగు నెలల పాటు ఇదే పరిస్థితితో కొనసాగాల్సి రావచ్చు అంటున్నారు.
201754 576253This internet web site is often a walk-through for all with the expertise you wanted concerning this and didnt know who should. Glimpse here, and youll completely discover it. 974583
602078 347695Giving you the top News is quite significantly imptortant to us. 176653