తెలంగాణ వచ్చిన తరువాత మొదటిసారి తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అలానే వైద్యశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అప్పుడప్పుడు టి రాజయ్య నోరుజారి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కెసిఆర్ మొదటి ప్రభుత్వంలో రాజయ్య ఎన్నోసార్లు ఇలా నోరుజారి అభాసుపాలయ్యాడు.
చివరకు మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సిన దుస్తతి వచ్చింది. ఇది గతించిపోయింది. రెండోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాజయ్యను దూరంగా పెట్టాడు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు పదవి ఇవ్వలేదు. వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రాజయ్యను కావాలనే దూరంగా పెట్టారు. మంత్రిపదవిలో ఉండగానే అమ్మాయిల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజయ్య, పదవి లేకపోతే మాత్రం మాట్లాడకుండా ఉంటాడా.
అప్పట్లో మాటలతో మాత్రమే చెప్పేవాడు.. ఇప్పుడు చేతలతో చూపిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు అని షాక్ కాకండి. ఇటీవలే ఈయనగారు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో చిలువూర్ మండంలోని స్కూల్ లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ విద్యార్థిని గురించి బాగా పొగిడాడు. కట్ చేస్తే భోజనాల సమయంలో అదే విద్యార్థిని రాజయ్యకు భోజనం కలిపి గోరు ముద్దలు తినిపిస్తోంది. పక్కన ఉపాధ్యాయులు ఉన్నారు.. మీడియా ఉన్నది.. వీడియోలు తీస్తున్నారు అనే విషయాలను పట్టించుకోకుండా.. ఆ పదో తరగతి విద్యార్థిని తినిపిస్తుంటే.. హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో నెటిజన్లు రాజయ్యపై ఫైర్ అవుతున్నారు. అయితే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నాడు రాజయ్య.
298123 76677I adore foregathering useful information, this post has got me even more info! . 901803
318458 357551You designed some decent points there. I looked over the internet for your issue and discovered most people will go along with together with your website. 367711