ఓ పక్క ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముంచేస్తోంటే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది. ‘రేషన్ కార్డు వున్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం తరఫున 1000 రూపాయల సాయం..’ అని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణలో ఈ మొత్తం 1,500 రూపాయలు. అయితే, ఆంధ్రప్రదేశ్లోనే వ్యవహారం నిస్సిగ్గుగా మారిపోయింది. గ్రామ వాలంటీర్లు పంచాల్సిన వెయ్యి రూపాయల మొత్తం, వైసీపీ నేతల ద్వారా పంపకం జరుగుతోంది.
పైగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ అభ్యర్థులు కొందరు 1000 రూపాయలు పంచుతూ, తమ పార్టీకి ఓటెయ్యాలంటూ అభ్యర్థించడం గమనార్హం. శవ రాజకీయాలకు పరాకాష్ట ఇది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన వెయ్యి రూపాయల మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వం ఈ మేరకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆ డబ్బుల్ని ఎన్నికల ప్రచారంలో ఓట్ల కొనుగోలు కోసం వెచ్చించే మొత్తంలా చూస్తే ఎలా.? ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వీడియోలు హల్చల్ చేసేస్తున్నాయి.
పార్టీలకతీతంగా తమ తమ ప్రాంతాల్లో ప్రజల్ని ఆదుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని స్వాగతించాల్సిందే. కానీ, ప్రభుత్వ సొమ్ముతో.. అధికార పార్టీ నేతలు, పైగా.. స్థానిక ఎన్నికల బరిలో నిలిచిన అధికార పార్టీ అభ్యర్థులు పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.? నవ్వి పోదురుగాక మనకేటి.? అన్న చందాన అధికార పార్టీ నేతలు శవ రాజకీయాలు చేస్తోంటే, జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా కంటే భయంకరంగా తయారైంది ఈ రాజకీయమంటూ జనం, అధికార పార్టీ తీరుపై దుమ్మెత్తిపోస్తుండడం గమనార్హం.
103396 920493This internet web site is my aspiration, quite superb style and Perfect articles. 37384
908553 699728Im glad to become a visitor in this pure web site, regards for this rare info! 376632