Switch to English

ప్రత్యేక విమానంలో.. అయిననూ పోయి రావలె హస్తినకు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (అదేనండీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికో.. రాష్ట్రానికి సంబంధించిన మరో కీలకమైన అంశం గురించో కాదండోయ్‌.! తమ పార్టీకి చెందిన ఓ ఎంపీ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొద్ది రోజులుగా పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారైన విషయం విదితమే.

నిజానికి, నర్సాపురం ఎంపీ వాదనల్లో నూటికి నూరు శాతం స్పష్టత వుంది. కానీ, ఆయన్ని విమర్శించే విషయంలో వైసీపీ నేతల్లోనే స్పష్టత కరువయ్యింది. నర్సాపురం ఎంపీ విషయంలో వైసీపీ ఎంత గందరగోళంగా వుందో చెప్పడానికి, ఆయనకు ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌లో పార్టీ పేరుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌గా పేర్కొనడమే నిదర్శనం.

నర్సాపురం ఎంపీకి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయి. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అలాంటప్పుడు, ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రత్యేక విమానంలో ‘హస్తినకు’ వైసీపీ నేతలు వెళ్ళి ఏం లాభం.? ‘అయిననూ పోయి రావలె హస్తినకు..’ అన్నట్టు తప్ప, ఈ ‘ఢిల్లీ టూర్‌’పై చిత్తశుద్ధి మాత్రం వైసీపీలో కన్పించడంలేదు.

ఇక, ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా పవర్‌ ఫుల్‌ పంచ్‌లు వేశారు. ‘అప్పుడెప్పుడో సెర్బియాలో అరెస్టయిన మీ సహ నిందితుడి కోసం కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు మీ ఎంపీని సస్పెండ్‌ చేయించడానికి ప్రత్యేక విమానంలో వెళుతున్నారు.. మీకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా.? ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగరా.?’ అంటూ లోకేష్‌ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. లోకేష్‌ ట్వీట్‌లోనూ స్పష్టత వుంది. నర్సాపురం ఎంపీ అడుగుతున్నట్లుగా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌’ పేరుతో షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చేస్తే, ఆయన వివరణ ఇస్తారేమో.! పైగా, ఆయన ‘నేను పార్టీని వీడను మొర్రో..’ అంటోంటే, ప్రత్యేకంగా ఢిల్లీకి విమానం వేసుకుని వెళ్ళి మరీ, ఆయన్ని పార్టీకి, ఆయన పదవికీ దూరం చేయాలనే ‘కసి’ వైసీపీ నేతలకు ఎందుకట.?

ఏదిఏమైనా, వైసీపీ నేతల ఢిల్లీ టూర్‌ అభాసుపాలవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు వైసీపీని ఏకి పారేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని మీ పార్టీ అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారా.? అని నిలదీస్తున్నారు. మరి, అది పార్టీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానమా.? ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన విమానమా.? వైసీపీ నుంచి కాస్త స్పష్టత వస్తే బెటర్‌.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...