ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీవీ5 ఛైర్మన్ బిఆర్ నాయుడు ల మధ్య లక్ష యూరోలు అంటే రూ. 11 కోట్ల హవాలా లావాదేవీలపై ఏపీ సీఐడీ వద్ద ఆధారాలున్నాయని ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీలు. ఈ విషయాన్ని ప్రధాని మోడీకి 14 పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేసి ఆ లేఖ మీద సంతకాలు చేసి, ఆ లేఖ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శీతారామన్ ను కలిసి అందించారు వైసీపీ ఎంపీలు.
అంతేకాదు ఆ ఫిర్యాదు తో పాటుగా కీలక ఆధారాలను కూడా వైసీపీ ఎంపీలు సమర్పించారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీవీ5 ఛైర్మన్ బిఆర్ నాయుడు మధ్య లక్ష యూరోల హవాలా లావాదేవీలు జరిగాయనీ, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయని, 11 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు నివేదికలో వెల్లడైందనీ.. రఘు రామ కృష్ణం రాజు, బిఆర్ నాయుడుల మీద అక్రమ నగదు చలామణి చట్టం, ఫెమా కింద కేసులు నమోదు చేసి, వారిద్దరూ దేశం విడిచి పారిపోకుండా కఠిన చర్యలతో పాటూ కస్టడీలోకి తీసుకుని అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని వైసీపీ ఎంపీలు కోరారు.
ఆర్ఆర్ఆర్ కేసు విషయంలో బిఆర్ నాయుడు పాత్ర చిన్నగా మొదలైన చినుకులు, చిలికి చిలికి గాలి వానగా మారబోతుందన్నట్లే ఉంది.
338532 768269I also recommend HubPages itself, and Squidoo, which is comparable. 523788
247633 106055I surely did not understand that. Learnt 1 thing new today! Thanks for that. 576127