అధికార వైసీపీకి బానిసత్వం ఓ వైపు.. అబ్బే, తాము బానిసలం కాదని చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్న వైనం ఇంకో వైపు. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదేమో.. అనేంతలా, ‘బులుగు మీడియా’ వెక్కి వెక్కి ఏడుస్తోంది. గడచిన రెండున్నరేళ్ళుగా, ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ.. అభివృద్ధిని పడకేసి, సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే.
నాన్సెన్స్.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్న విషయాన్ని విపక్షాలు, యెల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయంటూ బులుగు మీడియా ఎగిరెగిరిపడింది. ఏమయ్యిందోగానీ, ఒక్కసారిగా ‘శంకుస్థాపనలు తప్ప, అభివృద్ధి ఎక్కడ.?’ అని అదే బులుగు మీడియా, అధికార వైసీపీని నిలదీస్తోంది. తెరవెనుకాల ఏం జరిగి వుంటుందబ్బా.?
అప్పుడప్పుడూ, ఇలా తమ నిజాయితీని చాటేసుకునేందుకు బులుగు మీడియా ఇలాంటి కథనాల్ని తెరపైకి తెస్తోందేమో. సొంత జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడెళ్ళినా పలు శంకుస్థాపనలు చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటి కార్యక్రమాలు చాలానే వున్నాయి. అయితే, ‘ఎప్పుడూ శంకుస్థాపనలేనా.? శంకుస్థాపనలు జరిగిన తర్వాత కనిపించాల్సిన అభివృద్ధిపై శ్రద్ధ లేకపోతే ఎలా.?’ అంటూ తమ యజమానినే నిలదీసేందుకు బులుగు మీడియా సాహసించింది.
అరరె, ఇది నిజంగా నిలదీత అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది బులుగు చైతన్యం కాదు, బులుగు పైత్యం. అన్నట్టు, ఇలాంటి కథనాలు బులుగు మీడియాలో కొత్తేమీ కాదు. గతంలో వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, ఇకపైనా వస్తాయి. డైవర్షన్ రాజకీయం తరహాలో.. డైవర్షన్ మీడియా అన్నమాట ఇది.
ఏదిఏమైనా ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీ హయాంలో శంకుస్థాపనలు తప్ప అభివృద్ధి కనిపించడంలేదు. కనిపించదు కూడా.
142536 450013You know, many persons are looking around for this information, you could help them greatly. 572432