Switch to English

YSRCP: వైసీపీ కొంప ముంచిన గ్రాఫిక్స్.! పార్టీ శ్రేణులు కకావికలం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజానీకం తిరుపతికి తరలి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి పెద్ద పొలిటికల్ ఈవెంట్ అది. దాన్ని తలదన్నే పొలిటికల్ ఈవెంట్ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగింది లేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే రాజకీయ సభలకీ పెద్దయెత్తున జనం తరలి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులే అనండీ.. ఇంకోటనండీ.. జనసేన కార్యక్రమాలకు జనాల్ని తరలించాల్సిన అవసరం వుండదు.

వేరే రాజకీయ పార్టీలు ఏవి ఎక్కడ ఎలాంటి రాజకీయ సభలు పెట్టినా జనాల్ని తరలించాల్సిందే. అన్నట్టు, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జనం స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారనుకోండి.. అది వేరే వ్యవహారం.

వైఎస్ జగన్ పాదయాత్రలకి జనాన్ని ప్రతిరోజూ మేపాల్సి వచ్చేది. అదే పద్ధతి నారా లోకేష్ పాదయాత్రలోనూ ఫాలో అయ్యారు టీడీపీ నేతలు. ప్రతిరోజూ జనాన్ని చూపించాలంటే, పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిందే.

ఇక, అసలు విషయానికొస్తే, ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభలకు ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చయ్యిందనేది ఓ అంచనా. బహిరంగ సభల నిర్వహణ, ప్రచార ఖర్చు.. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు వెయ్యి కోట్లు వైసీపీ ఖర్చు చేసిందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం జనాల్ని తరలించడానికే వినియోగించారట.

మూడు లక్షలు, ఆరు లక్షలు, పది లక్షలు, పదిహేను లక్షలు.. ఇలా పెంచుకుంటూ పోయారు. అద్దంకిలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభకి 15 లక్షల మంది వచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది.. కాదు కాదు 18 లక్షలని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, విజువల్స్ చూస్తే, లక్షన్నర మంది కూడా వచ్చి వుండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తోడు, అక్కడ ఫొటో ఎడిట్లు, గ్రాఫిక్స్ వినియోగం.. ఇవన్నీ చూశాక, ‘బొత్తిగా ఖర్చు దండగ సిద్ధం’ అంటూ వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. జాతీయ మీడియా సైతం, ఈ గ్రాఫిక్స్ బహిరంగ సభని ఏకి పారేస్తుండడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఇలా గ్రాఫిక్స్ మీద ఆధారపడి జనాల్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసింది లేదు. ఈ విషయంలో వైసీపీ ట్రాక్ రికార్డ్ వేరే లెవల్ అంతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...