అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజానీకం తిరుపతికి తరలి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి పెద్ద పొలిటికల్ ఈవెంట్ అది. దాన్ని తలదన్నే పొలిటికల్ ఈవెంట్ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగింది లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే రాజకీయ సభలకీ పెద్దయెత్తున జనం తరలి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులే అనండీ.. ఇంకోటనండీ.. జనసేన కార్యక్రమాలకు జనాల్ని తరలించాల్సిన అవసరం వుండదు.
వేరే రాజకీయ పార్టీలు ఏవి ఎక్కడ ఎలాంటి రాజకీయ సభలు పెట్టినా జనాల్ని తరలించాల్సిందే. అన్నట్టు, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జనం స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారనుకోండి.. అది వేరే వ్యవహారం.
వైఎస్ జగన్ పాదయాత్రలకి జనాన్ని ప్రతిరోజూ మేపాల్సి వచ్చేది. అదే పద్ధతి నారా లోకేష్ పాదయాత్రలోనూ ఫాలో అయ్యారు టీడీపీ నేతలు. ప్రతిరోజూ జనాన్ని చూపించాలంటే, పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిందే.
ఇక, అసలు విషయానికొస్తే, ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభలకు ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చయ్యిందనేది ఓ అంచనా. బహిరంగ సభల నిర్వహణ, ప్రచార ఖర్చు.. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు వెయ్యి కోట్లు వైసీపీ ఖర్చు చేసిందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం జనాల్ని తరలించడానికే వినియోగించారట.
మూడు లక్షలు, ఆరు లక్షలు, పది లక్షలు, పదిహేను లక్షలు.. ఇలా పెంచుకుంటూ పోయారు. అద్దంకిలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభకి 15 లక్షల మంది వచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది.. కాదు కాదు 18 లక్షలని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, విజువల్స్ చూస్తే, లక్షన్నర మంది కూడా వచ్చి వుండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి తోడు, అక్కడ ఫొటో ఎడిట్లు, గ్రాఫిక్స్ వినియోగం.. ఇవన్నీ చూశాక, ‘బొత్తిగా ఖర్చు దండగ సిద్ధం’ అంటూ వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. జాతీయ మీడియా సైతం, ఈ గ్రాఫిక్స్ బహిరంగ సభని ఏకి పారేస్తుండడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఇలా గ్రాఫిక్స్ మీద ఆధారపడి జనాల్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసింది లేదు. ఈ విషయంలో వైసీపీ ట్రాక్ రికార్డ్ వేరే లెవల్ అంతే.!
ఆంధ్రప్రదేశ్ సియం ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసారా ? డ్రోన్ షార్ట్స్ తో, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారు. అందుకే, ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారు https://t.co/BC1AO86DBO
ఈ ఫోటోని, ఎలా… pic.twitter.com/3vmx4n5Z8h— Lokesh Nara (@naralokesh) March 11, 2024